OTT Movie : బెంగాల్ మాఫియా జానర్ లో ఒక సిరీస్ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ప్రతి ఎపిసోడ్ క్లైమాక్స్ లా ఉంటుంది. ఇది పొలిటికల్, మాఫియా మధ్య జరిగే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్
ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ టెలివిజన్ సిరీస్ పేరు ‘ఖాకీ: ది బెంగాల్ చాప్టర్’ (Khakee: The Bengal Chapter). 2025లో విడుదలైన ఈ సిరీస్ ను నీరజ్ పాండే సృష్టించారు. దీనికి దేబత్మ మండల్, తుషార్ కాంతి రే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను ఫ్రైడే స్టోరీటెల్లర్స్ బ్యానర్ కింద శీతల్ భాటియా నిర్మించారు. ఇందులో ప్రసెన్జిత్ చటర్జీ, జీత్, శాశ్వత చటర్జీ, రిత్విక్ భౌమిక్, చిత్రాంగద సింగ్, మహాక్షయ్ చక్రవర్తి, ఆదిల్ జాఫర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ లో పరంబ్రత చటర్జీ ఒక ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఇది ఏడు ఎపిసోడ్ల సిరీస్ గా కోల్కతాలోని రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది. ఇది 2025 మార్చి 20న నెట్ఫ్లిక్స్లో ప్రీమియర్ అయింది. ఇది హిందీ, బెంగాలీ భాషలలో ఏకకాలంలో స్ట్రీమింగ్ అయిన మొదటి హిందీ షోగా గుర్తింపు పొందింది. ఇది IMDbలో 7.3/10 రేటింగ్ను పొందింది.
స్టోరీలోకి వెళితే
2000ల ప్రారంభంలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఈ స్టోరీ తిరుగుతుంది. శంకర్ బరువా, అలియాస్ బాఘా అనే ఒక భయంకరమైన అండర్వరల్డ్ డాన్తో ప్రారంభమవుతుంది. అతను కిడ్నాపింగ్, హత్యలు, మనుషుల రవాణా వంటి అక్రమ కార్యకలాపాల నెట్వర్క్ను నడుపుతుంటాడు. బాఘాకు బరున్ రాయ్ అనే ఒక శక్తివంతమైన రాజకీయవేత్త పలుకుబడి ఉంటూఉంది. ఇతను అధికారంలో ఉన్న CPI(M) పార్టీలో కీలక వ్యక్తిగా ఉంటాడు. అతని అండర్ లోనే అండర్వరల్డ్ మాఫియా ఉంటుంది. బరున్ రాయ్ నామమాత్రపు ముఖ్యమంత్రి శీర్షేందు దాస్ ను తన చెస్ ఆటలో ఒక బొమ్మగా ఉపయోగిస్తాడు. బాఘా సామ్రాజ్యాన్ని సాగర్ తలుక్దార్, రంజిత్ ఠాకూర్ అనే ఇద్దరు అనుచరులు నడిపిస్తారు. కానీ వారి అహంకారంతో ఇక్కడ చీలిక మొదలవుతుంది. సిరీస్ ప్రారంభంలో, నిజాయితీ గల IPS అధికారి సప్తర్షి సిన్హా హత్యకు గురవుతాడు.
దీని వల్ల ప్రభుత్వం ఒత్తిడికి గురవుతుంది. ఈ హత్యతో బాఘా నేర సామ్రాజ్యాన్ని అణచివేయడానికి, IPS అధికారి అర్జున్ మైత్రాను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) హెడ్గా నియమిస్తారు. అర్జున్ ఒక నిష్కపటమైన, షూట్-ఫస్ట్-ఆస్క్-లేటర్ విధానం కలిగిన అధికారి. అతను సిస్టమ్ను సవాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు. అతని బృందంలో అరత్రికా భౌమిక్, హిమెల్ మజుందర్ ఉంటారు. అర్జున్ వ్యక్తిగత జీవితం, అతని భార్య డాక్టర్ ఖుషీ మైత్రా తో సంబంధం కథను ముందుకు నడిపించే ఒక చిన్న ట్విస్ట్ను జోడిస్తుంది.
ఇంతలో సాగర్, రంజిత్, బాఘాకు ద్రోహం చేసి హత్య చేస్తారు. దీనితో వారు అతని సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటారు. అయితే తొందరగానే వారి స్నేహం విరిగిపోతుంది. ఎందుకంటే సాగర్ రిజర్వ్డ్ స్వభావం, రంజిత్ హాట్-హెడెడ్ ప్రవర్తన వారి మధ్య ఘర్షణకు దారితీస్తుంది. సాగర్ భార్య మంజులా ఆమె పిల్లి చోమ్చోమ్ కథలో ఎమోషన్స్ ను జోడిస్తాయి. ఇంతలో బరున్ రాయ్ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకుంటాడు. అర్జున్ను ముఖ్యమంత్రి శీర్షేందు దాస్ సెక్యూరిటీగా బదిలీ చేస్తాడు. అర్జున్, తన మాజీ ప్రియురాలు సహాయంతో, సాగర్, రంజిత్ మధ్య విభేదాలను సృష్టించే వ్యూహాలను అమలు చేస్తాడు. చివరికి అర్జున్ ఈ మాఫియాని ఎలా ఎదుర్కొంటాడు ? ఈ స్టోరీ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : శవం జేబులో ఫోన్.. సమాధి నుంచి కుర్రాడికి మెసేజులు, ఆ తర్వాత జరిగేది చూస్తే చలి జ్వరమే!