Best Thriller Movie in OTT : ఓటీటీలోకి హారర్ సినిమాలతో పాటు రొమాంటిక్ సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి. అందులో కొన్ని సినిమాలు జనాలను కట్టి పడేస్తాయి.. ఆ సినిమాల్లో కొన్ని హారర్ థ్రిల్లర్ సినిమాలు కూడా ఉన్నాయి. థియేటర్లలో రిలీజ్ కానీ సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యి సందడి చేస్తుంటాయి. ఇక ఈ మధ్య ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలు (Thriller Movies) రిలీజ్ అవుతున్నాయి.. తాజాగా మరో ఫ్యామిలీ డ్రామా మూవీ ఓటీటీలో సందడి చెయ్యనుంది. ప్రేమంచి పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడు.. భార్య పై చెల్లికి అనుమానం.. సస్పెన్స్ ట్విస్ట్ లతో కొత్త సినిమా వచ్చేస్తుంది.. ఆ సినిమా స్టోరీ ఏంటో ఒకసారి లుక్ వేద్దాం పదండీ…
టాలీవుడ్ రొమాంటిక్ హీరోయిన్ హెబ్బా పటేల్ (Hebah Patel) పేరు యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది.. ఆమె తెలుగులో అతి తక్కువ సినిమాలు చేసింది. అందులో కుర్రాళ్ళను రెచ్చగొట్టేలా కుమారి 21 ఎఫ్ ( Kumari 21 F) ఉంటుంది. ఆ సినిమా పాపకు మంచి క్రేజ్ ను అందించింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అన్ని కూడా రొమాంటిక్ జోనర్ లో వచ్చేసాయి. అయితే హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతుంది. హెబ్బాపటేల్ హీరోయిన్గా నటించిన తెలుగు మూవీ సందేహం ఓటీటీలోకి వచ్చేస్తోంది. నవంబర్ 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.. అక్కడ అంతగా ఆకట్టుకొని ఈ సినిమాపై ఓటీటీలో ఐదు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతుంది.. మరి ఆ సినిమా స్టోరీ ఏంటో ఒకసారి చూసేద్దాం..
జూన్ నెలలో థియేటర్లలో సందేహం మూవీ రిలీజైంది. దాదాపు ఐదు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాలో హీరో సుమన్ తేజ్ డ్యూయల్ రోల్లో కనిపించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) బంధువు సుమన్ తేజా ఈ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా స్టోరీ విషయానికొస్తే.. శృతి హర్షను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. కానీ మొదటి రాత్రి భర్తకు దూరంగా ఉంటుంది. పెళ్లి తర్వాత శృతిలో మార్పు వస్తుంది. హర్షను దూరం పెడుతుంది. ఫస్ట్ నైట్కు ఒప్పుకోదు. అదే టైమ్లో శృతి మాజీ బాయ్ఫ్రెండ్ ఆర్య ఆమె జీవితంలోకి మళ్లీ ఎంటర్ అవుతాడు. శృతికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు.
ఇక శృతి, హర్షలకు పెళ్లైనా కొద్ది రోజుల్లోనే కరోనా కారణంగా హర్ష చనిపోతాడు. హర్ష మరణంపై అతడి చెల్లెలికి ఓ క్లూ దొరకుతుంది. అదేమిటి? హర్ష చనిపోయాడా? బతికే ఉన్నాడా? హర్ష, ఆర్య ఒకే పోలికలతో ఉండటానికి కారణం ఏమిటి? ఎందుకు మళ్లీ ఆర్య శృతికి దగ్గరయ్యాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు ప్రేక్షకులకు కలుగుతాయి. ఈ మూవీ గురించి పూర్తిగా తెలియాలంటే సినిమాను మిస్ అవ్వకుండా చూడాలి.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం హెబ్బా పటేల్ తెలుగులో ఓదెల 2 మూవీలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. మైథలాజికల్ థ్రిల్లర్ మూవీలో తమన్నా (Tamannaah) హీరోయిన్గా నటిస్తోంది. సంపత్ నంది కథ, స్క్రీన్ప్లేను అందిస్తోన్న ఈ మూవీకి అశోక్ తేజ దర్శకత్వం వహిస్తోన్నాడు.