OTT Movie : రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తీసిన ‘నా బంగారు తల్లి’ అనే సోషల్ మెసేజ్ సినిమా, బాక్సాఫీస్లో సక్సెస్ ని అందుకుంది. తెలుగులోణే వచ్చిన ఈ సినిమా అనేక అవార్డులను కూడా అందుకుంది. ఈ సినిమా, 61వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ , నటి అంజలి పాటిల్ కి స్పెషల్ జ్యూరీ మెన్షన్, శాంతను మొయిత్రా బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. డెట్రాయిట్ ట్రినిటీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్ అవార్డులను దక్కించుకుంది. ఈ కథ అమ్మాయిల ట్రాఫికింగ్కు వ్యతిరేకంగా, ఒక సోషల్ మెసేజ్ ఇస్తుంది. ఈ సినిమా ఎక్కడ ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘నా బంగారు తల్లి’ (Na bangaru thalli) 2014లో వచ్చిన తెలుగు సోషల్ డ్రామా సినిమా. రాజేష్ టచ్ రివర్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీనివాస్ (సిద్దీఖ్), దుర్గా (అంజలి పాటిల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2 గంటల నిడివితో, IMDbలో 7.3/10 రేటింగ్ పొందింది. 2014 నవంబర్ 21న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లో ఉంది.
శ్రీనివాస్ ఒక మంచి తండ్రి. తన కూతురు దుర్గాను చాలా ఇష్టపడతాడు. దుర్గా చదువుకొని, హైదరాబాద్ వెళ్లి జాబ్ చేయాలని కలలు కంటుంది. శ్రీనివాస్ బయటకి మంచి మనిషిలా కనిపిస్తాడు, కానీ రహస్యంగా అమ్మాయిల బ్రోకర్ బిజినెస్లో ఉంటాడు. అయితే ఒక రోజు జాబ్ ఇంటర్వ్యూ కోసం, దుర్గాను ఆమె తండ్రి శ్రీనివాస్ హైదరాబాద్ కు పంపిస్తాడు. కానీ అక్కడ ట్రాఫికింగ్ మాఫియా ఆమెను కిడ్నాప్ చేస్తుంది. దుర్గాను ఫోర్స్గా ప్రాస్టిట్యూషన్ చేయమని బలవంతం చేస్తారు. శ్రీనివాస్కు ఈ విషయం తెలిసి షాక్ అవుతాడు. ఎందుకంటే అతను కూడా ఈ మాఫియాతో కనెక్ట్ అయి ఉన్నాడు.
శ్రీనివాస్ తన కూతురు దుర్గాను సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఈ సమయంలో అతడు ఎలాంటి పని చేస్తున్నాడో బయటపడుతుంది. దుర్గా ఈ ట్రాఫికింగ్ వల్ల చాలా బాధపడుతుంది. ఆమె లైఫ్ పూర్తిగా మారిపోతుంది. శ్రీనివాస్కు తన తప్పు తెలుస్తుంది. అతను చాలా బాధపడతాడు. అతను పోలీసులు, NGOల సహాయంతో దుర్గాను రక్షించాలని చూస్తాడు. కానీ అతని సీక్రెట్ లైఫ్ వల్ల, అతనికి సొసైటీలో గౌరవం పోతుంది. చివరికి దుర్గా ఈ ట్రాఫికింగ్ నుంచి బయటపడుతుందా ? తన తండ్రిని క్షమి స్తుందా ? అనే విషయాలను ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : దెయ్యాన్ని గెలికి మరీ తన్నించుకునే అమ్మాయిలు.. రోమాలు నిక్కబొడుచుకునే సీన్స్… కల్లోనూ వెంటాడే హర్రర్ స్టోరీ