Nayanam OTT Release : వరుణ్ సందేశ్ నటించిన ఉత్కంఠభరితమైన వెబ్ సిరీస్ ‘నయనం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆరు ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని సీట్ ఎడ్జ్ వరకు తీసుకెళ్తుంది. ఇటీవల విడుదలైన దీని ట్రైలర్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంది. 2 నిమిషాల, 18 సెకన్ల ట్రైలర్ ని చూశాక ఆడియన్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఈ సిరీస్ మీద అంచనాలు కూడా పెరిగాయి. వరుణ్ సందేశ్ డార్క్ రోల్లో ఇంప్రెస్ చేస్తాడని ట్రైలర్ ఆధారంగా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మనిషి మెంటాలిటీ ఎలా మారుతుందో ఎక్స్ప్లోర్ చేస్తూ, ప్రేక్షకుల్ని ఆలోచింపజేసేలా ఈ సిరీస్గా ఉంటుంది. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వస్తోంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లోవచ్చిన ‘నయనం’ (Nayanam) సిరీస్ లో వరుణ్ సందేశ్, ప్రియాంక జైన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఉత్తేజ్, అలీ రెజా, రేఖ నిరోష, హరీష్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్కు స్వాతి ప్రకాష్ మంత్రప్రగడ దర్శకత్వం వహించగా, కళ్యాణ్ కాగితపు స్క్రీన్ప్లే రాశారు. ZEE5 ఒరిజినల్ గా రూపొందిన ఈ సిరీస్ 2025 డిసెంబర్ 19న స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఇది ఆరు ఎపిసోడ్లతో సై-ఫై ఎలిమెంట్స్తో నడుస్తుంది.
Read Also : తెలుగులో ఇలాంటి సినిమానా ? మొత్తం అవే సీన్లు… ఇయర్ ఫోన్స్ పెట్టుకుని చూడాల్సిన సినిమా
డాక్టర్ నయన్ (వరుణ్ సందేశ్) ఒక ప్రతిభావంతుడైన కంటి వైద్యుడు. పేదవాళ్లకు ఉచిత చికిత్సలు అందిస్తూ, రహస్యంగా అక్రమ ప్రయోగాలు చేస్తుంటాడు. ఈ ప్రయోగాల ద్వారా పేషెంట్ల కళ్ల లెన్సుల్లో అమర్చిన టెక్నాలజీతో వాళ్ల ప్రస్తుత జీవితాల్ని లైవ్ లో చూడగలుగుతాడు. మొదట సైంటిఫిక్ క్యూరియాసిటీగా మొదలైన ఈ అబిలిటీ, క్రమంగా ఆబ్సెషన్గా మారి, మర్డర్ల వరకు దారితీస్తుంది. దీని వల్ల అతని జీవితం ఒక భయంకరమైన ఉచ్చుగా మారుతుంది. పోలీసులు కూడా అతని కోసం వెతకడం మొదలు పెడతారు. ఇంతకీ ఇతరుల పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడటం వల్ల నయన్ మనస్సు ఎలా మారిపోతుంది ? ఈ ఆబ్సెషన్ ఎంత దూరం తీసుకెళ్తుంది ? ఇవన్నీ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే. చర్చిస్తారు. ఇందులో ప్రియాంక జైన్ పోషించిన మాధవి పాత్ర కూడా కీలకంగా మారుతుంది.