Thriller Movie OTT : తమిళ్ ఇండస్ట్రీలో క్రైమ్ ట్రిల్లర్ మూవీస్ కి మంచి డిమాండ్ ఉంది. అదే క్రేజ్ అక్కడ వచ్చిన ప్రతి సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు ఇండస్ట్రీని సెట్ చేసేలా కలెక్షన్స్ కూడా అందుకుంటున్నాయి.. గత ఏడాది చాలా సినిమాలు క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చాయి. థియేటర్లలో వచ్చిన మూవీస్ కంటే ఓటిటిస్ లో వచ్చిన మూవీస్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.. తాజాగా ఓ థ్రిల్లర్ మూవీ ఓటిటిలోకి వస్తుంది. తమిళ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకున్న ఈ మూవీ ప్రస్తుతం ఓటిటిలో సందడి చేస్తుంది. ఈ మూవీ పేరేంటి? ఓటిటి ప్లాట్ఫారం లో ఈ సినిమా స్ట్రీమింగ్ వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
తమిళ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ వన్స్ అపాన్ ఏ టైమ్ మద్రాస్.. థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీతో వచ్చిన ఈ మూవీ స్టోరీ జనాలను పెద్దగా ఆకట్టుకోలేదు. హైపర్లింక్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈమూవీలో భరత్, అభిరామి, పవిత్రా లక్ష్మి, అంజలి నాయర్ వంటి నటులు ప్రత్యేక పాత్రల్లో నటించారు. థ్రిల్లర్ సినిమాకు ప్రసాద్ మురుగన్ దర్శకత్వం వహించాడు. డిసెంబర్ సెకండ్ వీక్లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది.. కానీ కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే రాబట్టింది. ఈ మూవీ జనవరి 17 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ స్టోరీ ఏంటి? ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుందో ఒకసారి చూద్దాం..
సినిమా స్టోరీ విషయానికొస్తే..
వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ సినిమా కాన్సెప్ట్, భరత్తో పాటు ప్రధాన పాత్ర ధారుల యాక్టింగ్కు ప్రశంసలు దక్కాయి. డైరెక్టర్ కొత్త వాడు.. మంచి కాన్సెఫ్ట్ ఉన్న సినిమా ఇది.. అయినా కూడా మూవీని సరిగ్గా చూపించలేదు.. అక్కడ డైరెక్టర్ తడబడ్డాడు. దాంతో మూవీ ప్రేక్షకులకు పెద్దగా నచ్చలేదు. గన్ కొందరి జీవితాలను ఎలాంటి మలుపులు తిప్పిందనే కాన్సెప్ట్తో దర్శకుడు ప్రసాద్ మురుగన్ వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ మద్రాస్ సినిమాను రూపొందించాడు. ఒక వ్యక్తి తన భార్యకు బాగోలేదని ఆసుపత్రిలో చూపించుకోవాలని డబ్బుల కోసం డిమాండ్ చేస్తాడు అలా అతను అతనికి తెలియకుండానే క్రైమ్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడు. లోన్ ఏజెంట్ భారీ నుంచి తన కూతుర్ని ఎలా కాపాడుకోవాలని చూస్తాడు. వేరే కులం వ్యక్తిని తన కూతురు ప్రేమిస్తుంది అది నచ్చక ఆ వ్యక్తి కూతుర్ని ఎలాగైనా తన దారికి తెచ్చుకోవాలని ఆలోచిస్తాడు ఇదంతా ఒక పాయింట్ చుట్టే కదా అల్లుతాడు డైరెక్టర్. స్టోరీ కాస్త కన్ఫ్యూషన్ గా ఉండడంతో జనాలు ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. మొత్తానికి థియేటర్లలో ఈ మూవీ యావరేజ్ టాక్ ను అందుకుంది. ఇక ఓటీటీలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి..