OTT Movie : రియల్ స్టోరీల ఆధారంగా ఈ మధ్య సినిమాలు బాగా వస్తున్నాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ లను, సైకో కిల్లర్ స్టోరీలను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఆడియన్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 1990లలో భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన రియల్ స్టోరీ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం సీరియల్ కిల్లర్స్ అంజనా, ఆమె ఇద్దరు కుమార్తెలు సీమా గవిత్, రేణుకా షిండేల నిజమైన కథ ఆధారంగా తెరకెక్కింది. వాళ్ళు 1996 నాటికి 40 మందికి పైగా పిల్లలను కిడ్నాప్ చేసి దాదాపు 12 మంది పిల్లలను హత్య చేశారు. వణుకు పుట్టించే ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
సుమన్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించిన ఈ సినిమా పేరు ‘పోషమ్ పా’. 2019లో విడుదలైన ఈ హిందీ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో మహి గిల్ , సయాని గుప్తా , రాగిణి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ఐయండిబి 6.3/10 రేటింగ్ తో ZEE5లో మాత్రమే అందుబాటులో ఉంది.
అంజనా, తన ఇద్దరు కుమార్తెలు సీమ, రేణుకతో కలిసి పిల్లలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటుంది. వీళ్ళు పేద కుటుంబాల పిల్లలను, రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్ల దగ్గర పెట్టి భిక్షాటన చేయించే వాళ్ళు. ఈ ముగ్గురూ కలిసి 40 మందికి పైగా పిల్లలను కిడ్నాప్ చేశారని, వారిలో 12 మందిని క్రూరంగా హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంజనా తన కుమార్తెలను ఈ భయంకరమైన పనులలోకి ఎలా లాగింది, వాళ్ళు తల్లి మాటలకు ఎలా బానిసలయ్యారు అనే విషయాన్ని ఈ సినిమా చూపిస్తుంది. ఈ ముగ్గురూ తమ నేరాలను ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, ఒక ఆటలాగా చేసేవాళ్ళు.
Read Also : ట్యూషన్ టీచర్పై ప్రేమ… ప్రేమించిన వాడు దక్కలేదని ఆ పిల్ల చేసే పనికి ఫ్యూజులు అవుట్