OTT Movie : భారతదేశంలో జరిగిన ఉగ్రవాద దాడుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీటిని ఆడియన్స్ ఎలా జరిగాయనే ఇంటెన్స్ తో చూస్తున్నారు. ముంబై దాడులవంటి సంఘటనల్లో ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దాడుల తరువాత ఉగ్రవాదుల వేట, బాధితుల జీవితాలు, సైనికుల పోరాటాలు ఈ స్టోరీలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ రోజు మనం బాంబు పేలుళ్లు, ఉగ్రవాద దాడుల ఆధారంగా వచ్చిన సినిమాలు, సిరీస్ లు ఏ ఓటీటీలో ఉన్నాయి ? వీటి వివారాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం.
2019 లో వచ్చిన ఈ సినిమాలో జాన్ అబ్రహం, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో తెరకెక్కింది. ఢిల్లీ సీరియల్ బాంబు దాడుల తర్వాత కొద్దిసేపటికే జరిగిన బాట్లా హౌస్ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
2008లో విడుదలైన ఈ సినిమా, 2006 ముంబై రైలు బాంబు దాడుల ప్రభావం సాధారణ ప్రజలపై ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, ఇర్ఫాన్ ఖాన్, సోహా అలీ ఖాన్, పరేష్ రావల్, కే కే మీనన్ ఆనంద్ గొరాడియా నటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఈ చిత్రం 1993 బొంబాయి బాంబు దాడుల సంఘటనలు, ఆ తరువాత జరిగిన పోలీసు దర్యాప్తు ఆధారంగా రూపొందింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2004 లో విడుదలైంది. ఇందులో కే కే మీనన్, ఆదిత్య శ్రీవాస్తవ, పవన్ మల్హోత్రా విజయ్ మౌర్య నటించారు. యూట్యూబ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ లో ఉంది.
2013 లో విడుదలైన ఈ చిత్రం 2008 ముంబై ఉగ్రవాద దాడుల ఆధారంగా, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రంలో సంజీవ్ జైస్వాల్, నానా పటేకర్, అతుల్ కులకర్ణి, ఆసిఫ్ బాస్రా, జితేంద్ర జోషి మరియు గణేష్ యాదవ్ కీలక పాత్రల్లో నటించారు. జియో హాట్స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఏడు ఎపిసోడ్ల సిరీస్ రాజీవ్ గాంధీ ఆత్మాహుతి బాంబు దాడిలో హత్యకు గురైన తర్వాత 90 రోజుల పాటు జరిగిన హంతకుల వేటను చూపిస్తుంది. దీనికి దర్శకత్వం నగేష్ కుకునూర్ నిర్వహించాగా, అమిత్ సియాల్, సాహిల్ వైద్, బగవతి పెరుమాళ్ మరియు గిరీష్ శర్మ నటించారు ఈ సిరీస్ 2025 జూలై 4న SonyLIVలో విడుదలైంది.
Read Also : మిస్టీరియస్ గా మర్డర్ కేసులు… మదర్ సెంటిమెంట్ తో క్రేజీ బెంగాలీ క్రైమ్ థ్రిల్లర్