Thriller movie OTT : థ్రిల్లర్ సినిమాలకు ఆడియన్స్ నుంచి ఇప్పుడు బాగా రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలు ప్రతి భాషలో ట్రెండ్ అవుతున్నాయి కూడా. ఇక ఈ సినిమాలను ఎక్కువగా ఓటీటీలలోనే చూడటానికి ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కన్నడ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలో మెంటలెక్కించే ట్విస్టులు ఉంటాయి. సిద్ధార్థ్ అనే వ్యక్తి ఒక రాత్రి ప్రయాణంలో దారి తప్పి ఒక అడవిలో చిక్కుకుపోతాడు. ఆ తరువాత స్టోరీ మరింత ఇంటెన్స్ గా సాగుతుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
ఈ కన్నడ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా పేరు ‘వృత్త’ (Vritta). 2025 ఆగస్టు 1న విడుదలైన ఈ సినిమాకు లిఖిత్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో మాహిర్ మొహియుద్దీన్, చైత్ర జె. ఆచార్, హరిణి సుందరరాజన్, శ్రీనివాస్ ప్రభు ప్రధాన పాత్రలు పోషించారు. టి. శివకుమార్ ఈ చిత్రాన్ని లక్షయ్ ఆర్ట్స్ బ్యానర్పై నిర్మించగా, రేవంత్ కులకర్ణి సంగీతం అందించారు. ఈ సినిమా ప్రస్తుతం ZEE5, Airtel Xstream Play ప్లాట్ ఫామ్లలో స్ట్రీమింగ్ అవుతోంది
సిద్ధార్థ్ అనే ఒక యువకుడు ఒక రాత్రి తన కారులో ఒంటరిగా బయలుదేరుతాడు. దారి మధ్యలో అనుకోకుండా ఒక రాంగ్ టర్న్ తీసుకోవడంతో, అతను ఒక దట్టమైన అడవి ప్రాంతంలోకి వెళ్తాడు. సరిగ్గా అదే సమయంలో అతనికి ఒక తెలియని వ్యక్తి నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ వల్ల అతను ఒక వింతైన మాయావలయంలో చిక్కుకుపోతాడు. తను ఎంత ప్రయత్నించినా ఆ అడవి నుండి బయటపడలేక, తిరిగి తిరిగి అదే చోటికి వస్తూ మానసిక వేదనకి గురవుతుంటాడు. ఇక ఆ అడవిలో అతనికి ఎదురయ్యే వింత అనుభవాలు అసలైనవా లేక అతని భ్రమలా అనేది సినిమా క్లైమాక్స్ వరకు ఉత్కంఠగా సాగుతుంది. అసలు సిద్ధార్థ్ కి కాల్ చేసింది ఎవరు ? ఎందుకు చేశారు ? సిద్ధార్థ్ అడవిలో నుంచి బయటకి వచ్చాడా ? అనే విషయాలను, ఈ సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుడుకోండి.
Read Also : గతం మరిచిపోయే భార్య… భర్త ఇచ్చే షాకింగ్ ట్విస్టులు… ఊహించని మలుపులతో చెమటలు పట్టించే స్టోరీ