రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరిగింది. నేడు జగిత్యాల వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున సభను నిర్వహిస్తున్నది.కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్ల పాటు సేవలు అందించి ఇటీవల రాజీనామా చేసిన మాజీ మంత్రి తన అనుచరులతో కలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది.చాలా కాలం తర్వాత కేసీఆర్ ఈ సభకు హాజరవుతున్నారు. జీవన్ రెడ్డి చేరిక అనంతరం ఆయన ఏం మాట్లాడుతారో అని రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, సీనియర్ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
బీఆర్ఎస్ సభ కోసం వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా మొత్తం గులాబీ రంగు పులుముకుంది. కేవలం జీవన్ రెడ్డి చేరికకోసం ఇంత పెద్ద ఆర్భాటం చేస్తున్నారని అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శలు చేశారు. కానీ, కేసీఆర్ మరోసారి ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారనే సంకేతాలు అధికార పార్టీని నిద్రపోనివ్వడం లేదని గులాబీ కేడర్ చెబుతోంది. జీవన్ రెడ్డికి మంత్రి పదవి లేద ఏదైనా నామినేటెడ్ పదవులు ఇస్తే పార్టీ మారేవారా? అని ఇటీవల మంత్ర అడ్లూరి లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కానీ, మంత్రి పదవికోసమో, నామినేటెడ్ పోస్టుల కోసమే పార్టీ మారడం లేదని.. ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో ఉండలేక పార్టీకి రాజీమానా చేసినట్టు జీవన్ రెడ్డి వర్గం చెబుతోంది.
కేసీఆర్ చాలా రోజుల తర్వాత బహిరంగ సభకు హాజరవుతున్నారు. పార్టీ అధికారం కోల్పోయాక ఆయన హాజరయ్యే రెండో భారీ బహిరంగ ఇదే కావడం గమనార్హం. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించిన సభలో కేసీఆర్ పెద్దగా మాట్లాడలేదు. కేవలం 10 నిమిషాల్లోపే ఆయన ప్రసంగం ఉండింది. ఇవాళ జగిత్యాల వేదికగా జరగనున్న సభలో ఎంత సేపు మాట్లాడుతారు? ఏ టాపిక్ మీద ఆయన ప్రసంగం ఉంటుంది? సర్కారును, సీఎం రేవంత్ను కార్నర్ చేస్తారా? ఇకమీదట ప్రజల్లోకి వస్తానని సంకేతం ఏమైనా పంపిస్తారా? లేదా ప్రభుత్వం మీద విమర్శలు చేశాక తిరిగి ఫాంహౌస్లో పరిమితం అవుతారా? అని జోరుగా చర్చజరుగుతున్నది. ప్రజలు ఇబ్బందులు, పెరుగుతున్న ధరలు.. ఎల్లుండి ఆర్టీసీ సమ్మె మొదలగు అంశాలను ప్రస్తావిస్తారా? రైతు భరోసా, రుణమాఫీ, ఆరుగ్యారంటీలపై మరోసారి విరుచుకపడతారా? అనేది తెలియాల్సి ఉన్నది.
Amaravati: షర్మిలాను అలా పిలవలేదు.. అందుకే దాసీ అన్నాను, టీడీపీపై కాసు మహేష్ రెడ్డి ఫిర్యాదు
బీఆర్ఎస్ సభకు మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు దూరంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. ఇవాళ సాయంత్రం సభ ప్రారంభం కానుంది. కేసీఆర్ ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. అయితే, సభా ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించిన హరీశ్ రావు .. ఉన్నట్టుండి సభకు హాజరుకాకపోవడం, ఢిల్లీకి ఎందుకు వెళ్లారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలాఉండగా, ఎల్లుండి కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్టును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ల మీద హైకోర్టు తుదితీర్పు వెల్లడించనుంది. అది కాస్త వ్యతిరేకంగా వస్తే కేసీఆర్, హరీశ్ రావుల మీద ప్రభుత్వం లీగల్ యాక్షన్కు ఆదేశాలు ఇవ్వనున్నట్టు సమాచారం.అందుకే ఆయన ఢిల్లీకి వెళ్లారని.. కేంద్రంతో మాట్లాడి క్రిమినల్ చర్యలను అడ్డుకునేలా రాష్ట్రం మీద ఒత్తిడి తేనున్నారని టాక్ వినిపిస్తోంది.