E-Paper
Advertisement

మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

మహిళా రిజర్వేషన్- డీలిమిటేషన్ బిల్లులు.. కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

Delhi Politics: మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు నేపథ్యంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు కేంద్రం మంత్రి కిషన్‌రెడ్డి. ఈ విషయంలో కాంగ్రెస్-బీఆర్ఎస్-ఎంఐఎంలు ఒక్కతాటి మీదకు వచ్చాయన్నారు.  ఆ పార్టీలు వ్యవహరిస్తున్న తీరును దుయ్యబట్టారు.

కాంగ్రెస్‌-బీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై కిషన్‌రెడ్డి ఎదురుదాడి

చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో గురువారం నుంచి మూడు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఆ బిల్లుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, దాని మిత్ర పక్షాలు ఆడుతున్న డ్రామాలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో శుక్రవారం ఉదయం మీడియా ముందుకొచ్చారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.

ఈ రెండు బిల్లుల విషయంలో తెలంగాణ, తమిళనాడులోని అధికార పార్టీ ఇష్టానుసారంగా మాట్లాడుతోందని ఆరోపించారు. పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. జనాభా సేకరణ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణ, తమిళనాడుకు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపణలు గుప్పించారని అన్నారు.

పీఠాలు కదులుతాయన్న భయం.. అందుకే బిల్లులకు వ్యతిరేకంగా ప్రచారం

దాన్ని అధిగమించే విధంగా దక్షిణ భారతానికి సీట్లు తగ్గకుండా ఉండేలా అన్ని రాష్ట్రాలకు సమానంగా సీట్లు పెంచేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దేశంలోని అన్ని ప్రాంతాల్లో మహిళలతోపాటు పురుషుల్లో కొత్త నాయకత్వం వస్తుందని భయం ఆ పార్టీలను వెంటాడుతోందన్నారు.

అందుకే ఈ బిల్లుల విషయంలో ఎలా పడితే అలా ఆరోపణలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరతరాలుగా వారి కుటుంబాల చేతుల్లో ఉన్నరాజకీయ వారసత్వం, ప్రాబల్యం మహిళల చేతుల్లోకి వెళ్తుందన్న కుట్రతో కాంగ్రెస్ తోపాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని అన్నారు.

ALSO READ: సీఎం రేవంత్‌‌రెడ్డితో ఏపీ రాజకీయ మహిళా నేతలు.. మొన్న రోజా, నిన్న ఏపీ టీడీపీ మహిళా నేతలు

తమ పీఠాలు కదిలిపోతాయన్న భయంతో ఈ రకమైన రాజకీయ డ్రామాలు మొదలుపెట్టారన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతలు కుమ్మక్కైయ్యారని ఆరోపించారు. వీటిపై తెలంగాణలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మహిళలు రాజకీయాల్లోకి రాకూడదనేది ఎంఐఎం కుట్రగా వర్ణించారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పదే పదే మాట్లాడారని గుర్తు చేశారు. మహిళలు రాజకీయాల్లోకి వస్తే అనేక ఇబ్బందులు వస్తాయని ఆ పార్టీ నేతలు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ పార్టీ మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకమని, పునర్విభజన జరిగితే హైదరాబాద్‌లో తమ పీఠాలు ఎక్కడ కదులుతాయోనని భయం వాటిని వెంటాడుతోందన్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీలను ఏకం చేసిందన్నారు. కొద్దిరోజులుగా మజ్లిస్ నేతలు చర్చలు జరిపారన్నారు.

 

Related News

నువ్వా నేనా..? నాకా నీకా..!? కేంద్ర మంత్రి ప‌ద‌వి కోసం వ‌ర్గ‌పోరు..!

ఆ ఇద్ద‌రికీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌లే టార్గెట్‌! ప‌వ‌న్‌, చంద్ర‌బాబుల రాజ‌కీయ వ్యూహం ఇదే!

బీజేపీ, బీఆరెస్ పొత్తు.. కేటీఆర్ కేంద్ర మంత్రి! కేసీఆర్‌కు కేంద్రం సిగ్న‌ల్ ఇస్తోందా? ఏం జ‌రుగుతోంది?

లీడ‌ర్‌గా విమ‌ర్శ‌లు.. హీరోగా అభిమానం! ప‌వ‌న్ పై కేటీఆర్ మ‌నోగ‌తమిదేనా? ప‌వ‌న్ సినిమాలంటే అంత ఇష్ట‌మా?

మోడీ.. తేజ‌స్వీ సూర్య‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..! తెలంగాణ‌పై అవే అవే మాట‌లు! తేడా లేదు.. పాపం.. బీజేపీ!

అయ్య జాగీరే! రెచ్చ‌గొట్టి.. చిచ్చుపెట్టి..! తెలంగాణ బీజేపికి కొత్త చిక్కు తెచ్చిపెట్టి!

గ‌ద్ద‌ర్‌కు కారు కొనిచ్చా..! ఇదిప్పుడు బ‌య‌ట‌పెట్టడం వెనుక నీ ఉద్దేశ‌మేంద‌యా ప‌వ‌ను!?

డిమాండ్లు పెడుతూ.. డేట్లు ఫిక్స్ చేసుకుంటూ..! స‌ర్కార్ కు క‌విత డెడ్‌లైన్‌ల త‌ల‌నొప్పి..

Big Stories

×