E-Paper
Advertisement

లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. అధికార-విపక్షాల మాటల యుద్ధం.. వాడి వేడీగా సమావేశాలు

లోక్‌సభలో బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం.. అధికార-విపక్షాల మాటల యుద్ధం.. వాడి వేడీగా సమావేశాలు
Advertisement

Loksabha Sessions: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం వాటికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టింది. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ బిల్లును ప్రవేశపెట్టారు. డీలిమిటేషన్ బిల్లును హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.

ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. సభలో బిల్లులను ప్రవేశ పెట్టిన కేంద్రం

Advertisement

చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టేందుకు గురువారం నుంచి మూడురోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్లకు తుది రూపం, డీలిమిటేషన్‌ ద్వారా నియోజకవర్గాలను పెంపు, పునర్విభజించేందుకు మూడు బిల్లులను లోక్‌సభ ముందుకు తీసుకొచ్చింది కేంద్రం.

ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన తర్వాత న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌, హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆయా బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీనిపై చర్చ మొదలైంది. అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ మాట్లాడారు. 2024లో మహిళా రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.

Advertisement

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేసీ వేణుగోపాల్.. కౌంటరిచ్చిన హోంమంత్రి అమిత్ షా

2023లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చామని ఈ సందర్భంగా సభ దృష్టికి ఆయన తీసుకొచ్చారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం హైజాక్ చేస్తోందన్నారు.  వెంటనే హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకుండా ఎలా చర్చ చేపడతారని అన్నారు.

బిల్లు ప్రవేశపెట్టకుండానే ఎలా ప్రశ్నించారని ఎదురుదాడి చేశారు. సభలో బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత సభ్యులు తమ తమ అభిప్రాయాలను చెప్పవచ్చన్నవారు. ప్రజల్లో ఆందోళన కలిగించేలా విపక్షాలు వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. జనగణన ఎందుకు చేపట్టలేదని ఎస్పీ ఎంపీ అఖిలేష్ ప్రశ్నిస్తున్నారని అన్నారు.

ALSO READ: అన్నట్టుగానే తమిళనాడులో.. డీలిమిటేషన్ పత్రాలను తగలబెట్టిన సీఎం స్టాలిన్

 

Related News

మేమొచ్చినా.. వెంట‌నే హామీలు అమ‌లు చేయ‌లేం.. ! కుదురుకోవ‌డానికి ఐదారేళ్లు ప‌డుతుందేమో..? ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై కేటీఆర్ కామెంట్స్‌..

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

Big Stories

Advertisement
×