E-Paper
Advertisement

Aadhar : ఆధార్ లో కీలక మార్పులు.. తెలుసుకోకపోతే నష్టపోతారు!

Aadhar : ఆధార్ లో కీలక మార్పులు.. తెలుసుకోకపోతే నష్టపోతారు!
Advertisement

Aadhar : డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ఆధార్ సేవలపై భారత ప్రభుత్వం పరిమితులను సడలించింది. బయోమెట్రిక్ ఐడీలను దుర్వినియోగం చేయటాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది.

ఈ కామర్స్, ప్రయాణం, హాస్పిటాలిటీ హెల్త్ కేర్ వంటి సేవలతో పాటు ప్రతీ విషయంలో భాగమైపోయిన ఆధార్ కార్డు సేవలపై ఇండియన్ గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 1.4 బిలియన్లకు పైగా ప్రజలు ఆధార్ కార్డును కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో మరింత గోప్యతను పెంచేందుకు భారత ఐటీ మంత్రిత్వ శాఖ ఆధార్ అథెంటిఫికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో పలు సవరణలు చేసింది. 2020లో ప్రవేశపెట్టిన చట్టాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కోరే ప్రైవేట్ కంపెనీల యాక్సిస్ ను పరిమితం చేసే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో భారత ప్రభుత్వం పలువురుతో సంప్రదింపులు జరిపి దాదాపు రెండేళ్ల తర్వాత కొత్త సవరణలు తీసుకొచ్చింది.

Advertisement

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వివిధ సేవలను అందించటానికి ఆధార్ సేవలను పొందేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రెండింటిని అనేబుల్ చేసే అవకాశం కల్పించింది. ఈ సేవలను మరింత మెరుగుపరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

బ్యాంకింగ్, టెలికాం ఆపరేటర్లుతో పాటు కొత్త కస్టమర్లను ఆన్ బోర్డ్ చేయడానికి ఆధార్ ను ఉపయోగించేవారు కొత్త వినియోగదారులను ధృవీకరించడానికి మరిన్ని సేవలను తీసుకురావడానికి ఈ ఆధార్ వెరిఫికేషన్ లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది.

Advertisement

UIDAI వెబ్‌సైట్ ప్రకారం.. ఆధార్ ప్రమాణీకరణ జనవరిలో 129.93 బిలియన్ లావాదేవీలను జరిపినట్లు తెలుస్తుంది. గత ఏడాది ఫిబ్రవరిలో 109.13 బిలియన్లు ఉండగా.. ఈ ఏడాది మరింత పెరిగింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, నేషనల్ హెల్త్ ఏజెన్సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఈ నెలలో తమ వినియోగదారులను ధృవీకరించడానికి ఆధార్ ఆధారిత ప్రమాణీకరణను ఉపయోగించే అగ్ర సంస్థలలో ఉన్నాయి.

ఇక భారత ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక గుర్తింపు పద్ధతి ఆధార్… వ్యక్తిగత సమాచారాన్ని ఆధారంగా రూపొందించబడిందని తెలిసిందే. ఆధార్ సంఖ్య వ్యక్తి గుర్తింపును నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వ సేవలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ సిమ్ కార్డులు మొదలైనవి పొందడంలో సహాయపడుతుంది. పలు ప్రభుత్వ పథకాలకు (పథకాలు, రేషన్, పెన్షన్లు,) లబ్ధిదారుల గుర్తింపును నిర్ధారించడానికి ఆధార్ అనేది కీలక పత్రంగా మారిపోయింది. ఆధార్ ఆధారిత బేనిఫిట్లు (జన్ ధన్, పీఎం అవాస యోజన) డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా వేగంగా అందించబడతాయి. ఇది మధ్యవర్తులు లేకుండా ప్రయోజనాలు అందిస్తుంది.

ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలు మాదిరిగా, బ్యాంకు సేవలు (అనుమతులు, ప్యాంచేక్స్, లావాదేవీలు) నిర్వహించడం సులభం అవుతుంది. పాఠశాలల విద్యార్థులకు, రాష్ట్రీయ పథకాల ద్వారా ఉచిత, సబ్సిడీ పథకాలు సులభంగా లభించాయి. ఆధార్ తో డిజిటల్ సంతకం, కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను పాస్వర్డ్ లేకుండానే ఉపయోగించవచ్చు. దీంతో ఎన్నో కీలక పత్రాలు లేదా దరఖాస్తులు సులభంగా పూర్తి చేయవచ్చు

ALSO READ : కిర్రాక్ ఫీచర్స్ తో పోకో కొత్త మెుబైల్.. లాంఛ్ ఎప్పుడంటే!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×