BigTV English

Aadhar : ఆధార్ లో కీలక మార్పులు.. తెలుసుకోకపోతే నష్టపోతారు!

Aadhar : ఆధార్ లో కీలక మార్పులు.. తెలుసుకోకపోతే నష్టపోతారు!

Aadhar : డిజిటల్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫ్రేమ్ వర్క్ ఆధార్ సేవలపై భారత ప్రభుత్వం పరిమితులను సడలించింది. బయోమెట్రిక్ ఐడీలను దుర్వినియోగం చేయటాన్ని నివారించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపింది.


ఈ కామర్స్, ప్రయాణం, హాస్పిటాలిటీ హెల్త్ కేర్ వంటి సేవలతో పాటు ప్రతీ విషయంలో భాగమైపోయిన ఆధార్ కార్డు సేవలపై ఇండియన్ గవర్నమెంట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా 1.4 బిలియన్లకు పైగా ప్రజలు ఆధార్ కార్డును కలిగి ఉన్నారు. ఈ నేపథ్యంలో మరింత గోప్యతను పెంచేందుకు భారత ఐటీ మంత్రిత్వ శాఖ ఆధార్ అథెంటిఫికేషన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లో పలు సవరణలు చేసింది. 2020లో ప్రవేశపెట్టిన చట్టాన్ని సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కోరే ప్రైవేట్ కంపెనీల యాక్సిస్ ను పరిమితం చేసే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో భారత ప్రభుత్వం పలువురుతో సంప్రదింపులు జరిపి దాదాపు రెండేళ్ల తర్వాత కొత్త సవరణలు తీసుకొచ్చింది.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వివిధ సేవలను అందించటానికి ఆధార్ సేవలను పొందేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు రెండింటిని అనేబుల్ చేసే అవకాశం కల్పించింది. ఈ సేవలను మరింత మెరుగుపరుస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.


బ్యాంకింగ్, టెలికాం ఆపరేటర్లుతో పాటు కొత్త కస్టమర్లను ఆన్ బోర్డ్ చేయడానికి ఆధార్ ను ఉపయోగించేవారు కొత్త వినియోగదారులను ధృవీకరించడానికి మరిన్ని సేవలను తీసుకురావడానికి ఈ ఆధార్ వెరిఫికేషన్ లో కొన్ని మార్పులు తీసుకొచ్చింది.

UIDAI వెబ్‌సైట్ ప్రకారం.. ఆధార్ ప్రమాణీకరణ జనవరిలో 129.93 బిలియన్ లావాదేవీలను జరిపినట్లు తెలుస్తుంది. గత ఏడాది ఫిబ్రవరిలో 109.13 బిలియన్లు ఉండగా.. ఈ ఏడాది మరింత పెరిగింది. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, నేషనల్ హెల్త్ ఏజెన్సీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్.. ఈ నెలలో తమ వినియోగదారులను ధృవీకరించడానికి ఆధార్ ఆధారిత ప్రమాణీకరణను ఉపయోగించే అగ్ర సంస్థలలో ఉన్నాయి.

ఇక భారత ప్రభుత్వానికి చెందిన ప్రత్యేక గుర్తింపు పద్ధతి ఆధార్… వ్యక్తిగత సమాచారాన్ని ఆధారంగా రూపొందించబడిందని తెలిసిందే. ఆధార్ సంఖ్య వ్యక్తి గుర్తింపును నిర్ధారించడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వ సేవలు, బ్యాంకు ఖాతాలు, మొబైల్ సిమ్ కార్డులు మొదలైనవి పొందడంలో సహాయపడుతుంది. పలు ప్రభుత్వ పథకాలకు (పథకాలు, రేషన్, పెన్షన్లు,) లబ్ధిదారుల గుర్తింపును నిర్ధారించడానికి ఆధార్ అనేది కీలక పత్రంగా మారిపోయింది. ఆధార్ ఆధారిత బేనిఫిట్లు (జన్ ధన్, పీఎం అవాస యోజన) డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా వేగంగా అందించబడతాయి. ఇది మధ్యవర్తులు లేకుండా ప్రయోజనాలు అందిస్తుంది.

ఆధార్-లింక్డ్ బ్యాంక్ ఖాతాలు మాదిరిగా, బ్యాంకు సేవలు (అనుమతులు, ప్యాంచేక్స్, లావాదేవీలు) నిర్వహించడం సులభం అవుతుంది. పాఠశాలల విద్యార్థులకు, రాష్ట్రీయ పథకాల ద్వారా ఉచిత, సబ్సిడీ పథకాలు సులభంగా లభించాయి. ఆధార్ తో డిజిటల్ సంతకం, కనెక్టివిటీ, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లను పాస్వర్డ్ లేకుండానే ఉపయోగించవచ్చు. దీంతో ఎన్నో కీలక పత్రాలు లేదా దరఖాస్తులు సులభంగా పూర్తి చేయవచ్చు

ALSO READ : కిర్రాక్ ఫీచర్స్ తో పోకో కొత్త మెుబైల్.. లాంఛ్ ఎప్పుడంటే!

Related News

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Motorola Edge 70 Ultra 5G: మోటరోలా భారీ ఎంట్రీ.. కెమెరా, బ్యాటరీ, డిస్‌ప్లే అన్నీ టాప్ క్లాస్!

iPhone history: ప్రపంచాన్ని మార్చిన ఐపోన్ ఎవరు కనిపెట్టారు? ఎప్పుడు మొదలైంది?

Macbook Air ipad Air : ఆపిల్ సూపర్ డీల్స్.. తగ్గిన ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్‌బుక్ ఎయిర్ ధరలు

Big Stories

×