E-Paper
Advertisement

Festival Sale : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!

Festival Sale : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!
Advertisement

Festival Sale : ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ స్టార్ట్ చేసిన ఆన్లైన్ షాపింగ్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ ను విపరీతంగా కొనేసిన కస్టమర్స్… తాజాగా మరో కొత్త రికార్డును సృష్టించారు. శర వేగంగా జరిగిన ఆన్లైన్ సేల్స్ లో తొలి వారంలోనే వేల కోట్లలో షాపింగ్ జరిపినట్లు తాజాగా జరిపిన నివేదిక తెలిపింది.

అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఫెస్టివల్ సెల్ ను ఎంతో గ్రాండ్ గా ప్రారంభించాయి. ఈ సేల్లో ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, గృహ ఉపకరణాలపైన భారీ డిస్కౌంట్ను ప్రకటించాయి. ఐఫోన్ తో పాటు ప్రముఖ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్ను అందించాయి. ఇక సేల్ కొనుగోలులో వీటిపై డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ సెప్టెంబర్ 26న సేల్స్ మొదలుపెట్టాయి. ఈ సేల్స్ లో తొలి వారంలోని రూ. 54 వేల కోట్ల విలువైన అమ్మకాలు జరిపినట్లు డాటుమ్ ఇంటిలిజెన్స్ అనే సంస్థ సర్వే చేసి తెలిపింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగిన సేల్స్ లో రూ.54 వేల కోట్లు వచ్చాయని చెప్పుకొచ్చింది.

Advertisement

ఇక 2023 ఫెస్టివల్ సేల్ తో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలు 26 శాతం పెరిగినట్టు డాటుమ్ ఇంటిలిజెన్స్ చెప్పుకొచ్చింది. మొత్తం అమ్మకాల్లో 60% కు పైగా ఎలక్ట్రానిక్స్ దేనని తెలిపింది. వీటితో మొబైల్ ఫోన్స్ వాటా 38% కాగా ఇతర ఎలక్ట్రానిక్స్ 21 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఐఫోన్ 15 తో పాటు ఆపిల్ నుంచి వచ్చిన పాత మోడల్ మెుబైల్స్ కు సైతం మంచి గిరాకీ ఉన్నట్టు తెలిపింది. ఇక సాంసంగ్ నుంచి అతి తక్కువ ధరలో వచ్చిన గెలక్సీ s28 ఎఫ్ఏ ఫోన్ కు సైతం భారీ వచ్చిందని… ఈ ఫోన్ ను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపించారని తెలిపింది.

ALSO READ : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Advertisement

ఫెస్టివల్ సెల్లో ప్రీమియం మొబైల్స్ కు మంచి డిస్కౌంట్ లభించింది. వీటిని కొనేందుకు కస్టమర్స్ ఎక్కువగా ఆసక్తి చూపించారు. ముఖ్యంగా రూ. 30 వేలకు పైబడిన స్మార్ట్ ఫోన్స్ కొనటానికి ఎక్కువ ఆసక్తి చూపించారని తెలిపింది. ఇక గృహ ఉపకరణాలుకు మంచి డిమాండ్ ఉందని… డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, స్మార్ట్ టీవీలకు సైతం మంచి డిమాండ్ వచ్చిందని చెప్పింది. ఇక కొనుగోలుదారులు ఎక్కువ మంది ఈఎమ్ఐ ఆప్షన్ను ఎంచుకున్నారని… చిన్న చిన్న పట్టణాలతో పాటు నగరాల నుంచి ఎక్కువ ఆఫర్స్ వచ్చాయని తెలిపింది.

ఇక ఈ సంస్థ నివేదిక జరిపిన టైప్ 2, టైప్ 3 నగరాల నుంచి 70% కొనుగోళ్లు వచ్చాయని తెలిపింది. స్మార్ట్ టీవీలపై సైతం 80% కొనుగోళ్లు జరిగాయని తెలిపింది. ఈ ఫెస్టివల్ సెల్లో పూర్తి అమ్మకాలు రూ. లక్ష కోట్లకు పైగానే జరగవచ్చు అని సంస్థ తెలిపింది. ఇక గత ఏడాది ఫెస్టివల్స్ లో రూ. 81వేల కోట్ల సేల్స్ జరిగాయి. ఈ దసరా, దీపావళి ఫెస్టివల్ సేల్ మరి కొన్ని రోజుల పాటు కొనసాగుతుంది. మరి చివరకు సేల్స్ ఎన్ని లక్షల కోట్లు జరుగుతాయో చూడాలి.

Related News

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

Big Stories

Advertisement
×