E-Paper
Advertisement

Viral Video: టాబ్లెట్‌ను తొక్కి, నేలపై విసిరేసిన కేంద్ర మంత్రి..అసలు కారణమిదే..

Viral Video: టాబ్లెట్‌ను తొక్కి, నేలపై విసిరేసిన కేంద్ర మంత్రి..అసలు కారణమిదే..

Viral Video: కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో ఇటీవల ఒక వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఒక టాబ్లెట్‌ను నెలకేసి కొట్టారు. ఆ తర్వాత దానిపై నిలబడ్డారు. ఇదంతా ఎందుకని పరిశీలిస్తే భారతదేశంలో రూపొందించి, తయారు చేసిన టాబ్లెట్‌ను పరిశీలించేందుకు ఇలా చేసినట్లు తెలిసింది. VVDN టెక్నాలజీస్ తయారీ యూనిట్ నుంచి వచ్చిన టాబ్లెట్ బలాన్ని పరీక్షించేందుకు, అశ్విని వైష్ణవ్ దాన్ని ఎత్తు నుంచి నేలపై విసిరారు. దానిపై నిలబడ్డారు కూడా. ఆశ్చర్యకరంగా, టాబ్లెట్ ఏ మాత్రం దెబ్బతినలేదు.

పలువురి కామెంట్లు..
ఆ క్రమంలో ఇది విరిగిపోదని, భారతదేశంలో తయారు చేయబడిందని ఆయన గర్వంగా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా భారతదేశం స్వదేశంగా అధిక నాణ్యత గల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల విషయంలో దూసుకెళ్తుందనిపిస్తుంది. ఈ వీడియో చూసిన పలువురు గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం ఆ ట్యాబ్ ధర ఎంత, ఫీచర్లు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు దీనికి వారంటీ ఎన్నేళ్లు ఉందని ఇలా పలు రకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఏది ఏమైనా ఇండియాలో కూడా క్రమంగా అనేక రకాల టెక్ ఉత్పత్తులు తయారుకావడం మంచి విషయమని చెప్పుకోవచ్చు.

భారతదేశ AI సర్వర్ కూడా
అదే సమయంలో, అశ్విని వైష్ణవ్ VVDN టెక్నాలజీస్ నుంచి మరో వీడియోను షేర్ చేస్తూ, భారతదేశంలో అభివృద్ధి చేయబడిన AI సర్వర్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు. ఆ క్రమంలో ఆయన ఫ్యాక్టరీలోని ఉద్యోగులతో సంభాషించి, తయారీ ప్రక్రియ గురించి వివరాలు తెలుసుకున్నారు. గత ఫిబ్రవరిలో VVDN తయారు చేసిన మేడ్ ఇన్ ఇండియా ల్యాప్‌టాప్‌ను కూడా ఆయన పరిచయం చేశారు.

Read Also: Best Budget Tablets: రూ.19 వేల తగ్గింపుతో లెనోవో M11 …

భారతదేశ హార్డ్‌వేర్ కలలకు ఊపిరి
VVDN టెక్నాలజీస్ ఎండ్-టు-ఎండ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల అభివృద్ధిలో నైపుణ్యం కలిగిన భారతీయ సంస్థ. భారతదేశాన్ని ప్రపంచ హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో, ఈ సంస్థ పలు రకాల ఉత్పత్తులను తయారు చేస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం ఈ ప్రయత్నాలకు మరింత బలం చేకూరుస్తోంది. జనవరి 2025 నాటికి PLI 2.0 స్కీం ద్వారా రూ.10,000 కోట్ల విలువైన ఉత్పత్తులు సృష్టించబడ్డాయి. దీంతోపాటు గత 18 నెలల్లో 3,900 కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.

భారతదేశ సాంకేతిక భవిష్యత్తుకు ఊతం
ఈ వీడియోలు కేవలం ఒక టాబ్లెట్ లేదా AI సర్వర్ గురించి మాత్రమే కాదు. భారతదేశం సాంకేతిక, తయారీ రంగంలో స్వావలంబన సాధించే దిశగా చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రతిబింబిస్తున్నాయి. VVDN టెక్నాలజీస్ వంటి సంస్థలు, ‘మేక్ ఇన్ ఇండియా’ ద్వారా, భారతదేశాన్ని ప్రపంచ హార్డ్‌వేర్ మార్కెట్‌లో కీలక స్థానంలో నిలబెట్టేందుకు కూడా దోహదపడనున్నాయి.

Read Also: Best Budget Tablets: రూ.19 వేల తగ్గింపుతో లెనోవో M11 …

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×