BigTV English

ChatGPT Plus Free: ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్.. ఇండియాలో 5 లక్షల మందికి మాత్రమే

ChatGPT Plus Free: ఉచితంగా చాట్‌జీపీటీ ప్లస్.. ఇండియాలో 5 లక్షల మందికి మాత్రమే

ChatGPT Plus Free| చాట్‌జీపీటీ ఏఐ సేవలు అందించే ఓపెన్‌ఏఐ కంపెనీ భారతదేశంలో ఉచితంగా ప్రీమియం సర్వీస్ అయిన చాట్‌జీపీటీ ప్లస్ ని 5 లక్షల మందికి అందిస్తోంది. ఇదంతా ఒక పెద్ద విద్యా కార్యక్రమంలో ఓ భాగం. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఐదు లక్షల ఉచిత చాట్‌జీపీటీ ప్లస్ అకౌంట్లు అందించబోతోంది. ఈ ప్రక్రియ రాబోయే ఆరు నెలల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఓపెన్‌ఏఐ ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలతో కలిసి పనిచేస్తుంది.


ఈ ఖాతాలను మూడు మార్గాల ద్వారా అందిస్తారు. మొదట, విద్యా మంత్రిత్వ శాఖ.. 1 నుంచి 12వ తరగతి వరకు బోధించే ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఈ అకౌంట్లను సమన్వయం చేస్తుంది. రెండవది, ఏఐసీటీఈ (AICTE) దేశవ్యాప్తంగా ఉన్న సాంకేతిక సంస్థలతో కలిసి విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యుల డిజిటల్, పరిశోధన నైపుణ్యాలను బలోపేతం చేయడానికి సహాయం చేస్తుంది. మూడవది, ఏఆర్‌ఐఎస్‌ఈ (ARISE) సభ్య పాఠశాలలు కె-12 ఉపాధ్యాయులకు ఈ ఖాతాలను అందిస్తాయి, తద్వారా వారు రోజువారీ బోధనలో ఏఐ టూల్స్‌ను ఉపయోగించే అవకాశం పొందుతారు.

ఈ కార్యక్రమం ఓపెన్‌ఏఐ లెర్నింగ్ యాక్సిలరేటర్  ప్రొగ్రాంలో ఓ భాగం. ఇది భారతదేశంలో తొలిసారిగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం ఏఐని ఒక సాధనంగా ఉపయోగించి విద్యార్థులకు సబ్జెక్టులపై లోతైన అవగాహన కల్పించడం, ఇది కేవలం హోంవర్క్ లేదా పరీక్షలకు సమాధానాలను త్వరగా పొందే టూల్ గా కాకుండా ఉండాలని ఓపెన్‌ఏఐ భావిస్తోంది.


ఈ కార్యక్రమం కోసం ఓపెన్‌ఏఐ ఒక ప్రత్యేక నిపుణుడిని నియమించింది. గతంలో కోర్సెరా ఇండియా, ఆసియా పసిఫిక్ ఆపరేషన్స్ హెడ్‌గా పనిచేసిన రాఘవ్ గుప్తా, ఓపెన్‌ఏఐలో ఇండియా, ఏపీఏసీ కోసం విద్యా విభాగం అధిపతిగా చేరారు. ఆయన పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకోవడంతో పాటు, ఉపాధ్యాయులు తరగతి గదులలో ఏఐని ఉపయోగించే విధానాలను అన్వేషించేందుకు సహాయం చేస్తారు.

రాఘవ్ గుప్తా మాట్లాడుతూ.. భారతదేశంలో విద్య ఒక కీలక దశలో ఉందని, ఏఐ ద్వారా గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని అన్నారు. ఈ కార్యక్రమం లక్ష్యం కేవలం టెక్నాలజీని అందించడం మాత్రమే కాదు.. ఉపాధ్యాయులు, కంపెనీలతో కలిసి విద్యా ఫలితాలను మెరుగుపరచడం కోసం.. విద్యార్థులను ఏఐ నైపుణ్యం అవసరమయ్యే భవిష్యత్తుకు సిద్ధం చేయడం.

ఓపెన్‌ఏఐ భారతదేశంలో పరిశోధనకు కూడా మద్దతు ఇస్తోంది. ఐఐటీ మద్రాస్‌తో కలిసి ఏఐ విద్యలో దీర్ఘకాలిక అధ్యయనం కోసం $500,000 నిధులను అందిస్తోంది. ఈ పరిశోధన చాట్‌జీపీటీ వంటి సాధనాలు బోధనా పద్ధతులను ఎలా మార్చగలవో మరియు విద్యార్థులకు ఎలా ప్రయోజనం చేకూర్చగలవో చూస్తుంది.

ఈ ఏడాది చివరలో ఓపెన్‌ఏఐ న్యూఢిల్లీలో తమ మొదటి కార్యాలయాన్ని తెరవనుంది. దీని బట్టి భారతదేశం ఓపెన్ ఏఐకి ఎంత ముఖ్యమో తెలుస్తోంది. ఇప్పటికే భారతదేశం చాట్‌జీపీటీకి ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ మార్కెట్‌గా ఉంది. లక్షలాది మంది విద్యార్థులు హోంవర్క్, పరీక్షల శిక్షణ, ప్రాజెక్ట్‌ల కోసం దీనిని ఉపయోగిస్తున్నారు.

ఈ టెక్నాలజీని మరింత అందుబాటులోకి తీసుకురావడానికి.. ఓపెన్‌ఏఐ నెలకు రూ. 399 ధరతో యూపీఐ చెల్లింపు మద్దతుతో భారతదేశానికి ప్రత్యేక సబ్‌స్క్రిప్షన్ టైర్‌ను ప్రవేశపెట్టింది. అదనంగా, ఎలక్ట్రానిక్స్ – సమాచార మంత్రిత్వ శాఖతో కలిసి ఓపెన్‌ఏఐ అకాడమీని నడుపుతోంది, ఇది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు ఏఐ సాంకేతికతల గురించి అవగాహన కల్పించే కార్యక్రమం.

Also Read: ChatGPT Free vs ChatGPT Go vs ChatGPT Plus: ఏ ప్లాన్ బెటర్.. మీరు ఏది ఎంచుకోవాలి?

Related News

Galaxy A07: శామ్‌సంగ్ గెలాక్సీ అత్యంత చవక ఫోన్ లాంచ్.. రూ.10000లోపు ధరలో 5000mAh బ్యాటరీ

Six stroke engine:18 ఏళ్ల కృషి ఫలితం.. సిక్స్ స్ట్రోక్ ఇంజిన్.. మైలేజ్ ఏకంగా లీటర్‌కు 200 కిలోమీటర్లు

Vivo T4 Pro Launch: వివో T4 ప్రో ఇండియాలో లాంచ్.. మిడ్ రేంజ్‌లో పవర్‌ఫుల్ చిప్ సెట్, భారీ బ్యాటరీ

New Cyber Scam: కొత్త సైబర్ మోసం.. ఓటీపీ, కార్డు లేకుండానే బ్యాంకు ఖాతా ఖాళీ!

Pixel 10 Pro XL vs Galaxy S25 Ultra vs iPhone 16 Pro Max: స్మార్ట్‌ఫోన్ దిగ్గజాల మధ్య హోరాహోరీ.. విన్నర్ ఎవరు?

Big Stories

×