E-Paper
Advertisement

NASA : నాసాతో ఐఎస్ఎస్.. కొత్త ప్రాజెక్ట్‌పై ఫోకస్..

NASA : నాసాతో ఐఎస్ఎస్.. కొత్త ప్రాజెక్ట్‌పై ఫోకస్..
Advertisement

NASA : టెక్నాలజీ అనేది మనుషుల మధ్య దూరాన్ని తగ్గించాలి కానీ పెంచుతోందని అప్పటితరం వారు వాపోతున్నారు. టెక్నాలజీ అభివృద్ధి మనుషులకు ఎంత మంచి చేస్తుందో.. అంతే చెడు చేస్తుందని వాదిస్తున్నారు. మనుషుల మధ్య మానవాత్వాన్ని, అనుబంధాలను టెక్నాలజీ దూరం చేస్తుందని అంటున్నారు. అందుకే శాస్త్రవేత్తలు సైతం మనుషుల్లో మళ్లీ మానవత్వాన్ని పెంచడానికి ముందుకొచ్చారు. దాని వల్ల కలిగే లాభాలను కూడా వారే అందుకోవాలని అనుకుంటున్నారు.

గత 22 ఏళ్లుగా ఎంతోమంది శాస్త్రవేత్తలు లో ఎర్త్ ఆర్బిట్‌లో పరిశోధనలు చేశారు. మైక్రోగ్రావిటీతో పాటు మానవత్వం వల్ల కలిగే ప్రయోజనాలపై కూడా వారి పరిశోధనలు జరిగాయి. ఈ పరిశోధనల్లో పాల్గొన్నవారు ఎక్కువగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు చెందిన శాస్త్రవేత్తలే అయ్యిండడం గమనార్హం. వారితో పాటు ఐఎస్ఎస్ పార్ట్‌నర్‌షిప్‌లో పనిచేస్తున్న స్పేస్ స్టేషన్లు కూడా వారికి సాయంగా నిలబడ్డాయి. దీంతో పాటు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ)లో పనిచేస్తున్న దేశాలు కూడా తమ మద్దతును ప్రకటించాయి.

Advertisement

ఈఎస్‌ఏలో భాగమైన అమెరికా, జపాన్, కెనడా వంటి దేశాలు 2030 వరకు ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్‌తో కలిసి మానవత్వం కలిగే లాభాల ప్రయోగాలకు సాయం చేయనున్నాయి. రష్యా మాత్రం 2028 వరకు మాత్రమే ఈ ప్రయోగాలలో పాల్గొంటానని ప్రకటించింది. నాసా మాత్రం చివరి వరకు లో ఎర్త్ ఆర్బిట్ పరిశోధనల విషయంలో ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్‌కు తోడుగా ఉంటానని తెలిపింది. అంతే కాకుండా భవిష్యత్తులో స్పేస్ విభాగంలో ఏర్పడే కమర్షియల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు కూడా ఒక దారి చూపించాలని నాసా నిర్ణయించుకుంది.

ప్రస్తుతం ఇంట్నేషనల్ స్పేస్ స్టేషన్ ముఖ్య లక్ష్యం సైన్స్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్. నాసా కూడా తమ పరిశోధనల్లో తోడుగా ఉండడం తమకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని ఐఎస్ఎస్ ప్రకటించింది. నాసాతో పనిచేసే కాలం పెరగడం వల్ల మరెన్నో టెక్నాలజీకి సంబంధించిన సంచలనాలు సృష్టించాలని ఐఎస్ఎస్ భావిస్తోంది. లో ఎర్త్ ఆర్బిట్‌లో ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు మైక్రోగ్రావిటీపై పరిశోధనలు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. గత 20 ఏళ్లలో వారంతా కలిసి దాదాపు 3,300 పరిశోధనలు చేశారు.

Advertisement

లో ఎర్త్ ఆర్బిట్‌లో మైక్రోగ్రావిటీ గురించి తెలుసుకోవడంపైనే ఇప్పటివరకు ఎక్కువగా శాస్త్రవేత్తల దృష్టి, స్పేస్ స్టేషన్ దృష్టి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాకుండా శాస్త్రవేత్తలు తిరిగి భూమిపైకి సేఫ్‌గా చేరుకోవడానికి కూడా ఐఎస్ఎస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మానవత్వం అనేది ఇక్కడనుండే మొదలవ్వాలని ఐఎస్ఎస్ ప్రయత్నం. ఈ ప్రయత్నంలో నాసా కూడా ఐఎస్ఎస్‌కు తోడుగా నిలవనుంది. అలా తిరిగొచ్చిన శాస్త్రవేత్తలతో మరిన్ని పరిశోధనలు చేయించాలని అనుకుంటోంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×