E-Paper
Advertisement

Train Reservation : ట్రైన్ టికెట్ బుకింగ్, UPI పేమెంట్స్, క్రెడిట్‌ కార్డ్స్ బిల్స్, గ్యాస్‌ సిలిండర్ ధరల్లో కొత్త రూల్స్

Train Reservation : ట్రైన్ టికెట్ బుకింగ్, UPI పేమెంట్స్, క్రెడిట్‌ కార్డ్స్ బిల్స్, గ్యాస్‌ సిలిండర్ ధరల్లో కొత్త రూల్స్
Advertisement

Train Reservation : రైల్వే రిజర్వేషన్ లో కొత్త మార్పులు వచ్చాయి. దీంతో పాటు UPI నగదు బదిలీ, క్రెడిట్‌ కార్డులు, గ్యాస్‌ సిలిండర్ ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. గత నెలలోనే ఈ నిర్ణయం జరిగినప్పటికీ తాజాగా అమలులోకి వచ్చాయి.

ఇండియన్ రైల్వే టికెట్ రిజర్వేషన్ లో కీలక మార్పులు తీసుకొచ్చింది. ప్రయాణికుల సౌకర్యార్ధం టికెట్ బుకింగ్, లగేజీ తరలింపుల్లో కొత్త అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ ట్రైన్ టికెట్‌ లను 120 రోజుల గడువుతో బుకింగ్‌ చేసుకొనేందుకు అవకాశం ఉండేది. అయితే తాజాగా వచ్చిన నిబంధనలతో కేవలం 60 రోజుల ముందుగానే మాత్రమే టికెట్లను బుకింగ్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఇందుకు కారణాలు సైతం వెల్లడించిన రైల్వే.. 120 రోజుల ముందు రైల్వే టికెట్‌ లను బుకింగ్ చేసుకుంటున్న వారిలో 21 శాతం మంది టికెట్‌ క్యాన్సిల్‌ చేసుకుంటున్నారని తెలిపింది. దీంతో పాటు మరో 5 శాతం వరకు.. టికెట్లు కలిగి ఉన్నప్పటికీ ప్రయాణాలు చేయడం లేదని పేర్కొంది. దీంతో అత్యవసర సమయాల్లో ప్రయాణించాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని తెలిపింది.

Advertisement

అందుకే ఇటువంచి సమస్యలకు చెక్ పెట్టేందుకే మార్పులు చేస్తూ కేవలం 60 రోజుల ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఇక లగేజీ విషయంలోనూ రైల్వే మార్పులు చేసింది. ఇప్పటివరకూ విమానాల్లో పరిమితికి మించి లగేజీ తీసుకెళ్తే అదనపు రుసుము చెల్లించాల్సి ఉండేది. ఇకపై ఈ నిబంధనలను రైల్లో ప్రయాణించే ప్రమాణికులు అమలుచేసేందుకు ఇండియన్ రైల్వే సిద్ధమైంది. పరిమితికి మించి లగేజీ తీసుకువస్తే జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపింది. ఇక ఉచిత లగేజీ విషయంలోనూ అనుమతించిన దాని కంటే ఎక్కువ తీసుకొస్తే అదనంగా వసూలు చేస్తామని తెలిపింది.

ALSO READ : మొన్న ఐఫోన్స్.. ఈరోజు గూగుల్ ఫోన్స్ పై నిషేధం, ఇండోనేషియా ఎందుకు ఇలా చేస్తోంది?

Advertisement

భారతీయ బ్యాకింగ్ దిగ్గజం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కూడా తన నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. దేశీయ నగదు బదిలీ కోసం కొత్త రూల్స్‌ ను తెచ్చింది. నగదు చెల్లింపుల వ్యవవ్థను మెరుగుపరచడం, బ్యాంకింగ్‌ అవుట్‌లెట్ లభ్యత, KYC రూల్స్‌ ను సులభతరం చేయడం వంటివి ఉన్నాయి

ఇక ప్రముఖ ఆన్ లైన్ చెల్లింపులు యాప్ యూపీఐ.. సైతం తన నిబంధనల్లో కొత్త రూల్స్ అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకూ UPI లైట్‌ నుంచి రూ.500 వరకు పంపేందుకు మాత్రమే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఈ నింబంధనలను మారుస్తూ రూ. 1000 వరకు నగదు బదిలీ చేసుకునే అవకాశాన్ని యూపీఐ కల్పించింది.

SBI సైతం తన క్రెడిట్‌ కార్డు ఫైనాన్స్‌ ఛార్జీలను పెంచేసింది. ఇప్పటివరకూ 3.5 శాతంగా ఉన్న క్రెడిట్‌ కార్డు ఫైనాన్స్‌ ఛార్జీలను 3.75 శాతానికి పెంచింది. ఇక ఒక బిల్లింగ్ సైకిల్‌లో యుటిలిటీ పేమెంట్స్ సైతం రూ.50 వేలు దాటితే 1 శాతం సర్ ఛార్జ్ వసూలు చేస్తామని తెలిపింది.

ఇక నిత్యావసరాల్లో ఒకటిగా ఉన్న గ్యాస్‌ సిలిండర్ ధరలు సైతం అమాంతం పెరిగాయి. వాణిజ్య సిలిండర్‌ ధరను పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో 19 కేజీల గ్యాస్‌ సిలిండర్‌పై రూ.62 పెరిగింది. అయితే ఇది ఇంట్లో వినియోగించే 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధరకు వర్తించదని తెలిపింది.

 

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×