Gas Saving Tips: ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ గ్యాస్ కొరతతో ప్రజలు అల్లాడుతున్నారు. గ్యాస్ బుకింగ్ చేసిన 20-30 రోజులకు సిలిండర్ డెలివరీ జరుగుతుండటంతో అప్పటివరకూ ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది తక్కువ గ్యాస్ వినియోగంతో రుచికరమైన ఆహారాన్ని వండుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. అటువంటి వారికోసం ప్రెషర్ కుక్కర్ లో త్వరగా అయిపోయే టాప్ – 5 వంటకాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. ఈ వంటకాలు చాలా రుచిగా ఉండటంతో పాటు.. మీ గ్యాస్ ను సైతం ఆదా చేస్తాయి. ఇంతకీ ఆ డిషెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
బియ్యం, కూరగాయలు, మసాలాలను కలిపి నేరుగా కుక్కర్లో దీనిని వండవచ్చు. కేవలం 2 లేదా 3 విజిల్స్లో ఆహారం సిద్ధమైపోతుంది విడిగా గిన్నెల్లో వండటం కంటే ఇది చాలా తక్కువ గ్యాస్ను తీసుకుంటుంది.
కుక్కర్ లో పప్పు లేదా సాంబార్ ను అత్యంత వేగంగా తక్కువ గ్యాస్ ను ఉపయోగించి వండుకోవచ్చు. కందిపప్పు లేదా పెసరపప్పు కుక్కర్ లో వేస్తే చాలా త్వరగా ఉడుకుతుంది. పప్పుతో పాటే కూరగాయ ముక్కలను కూడా అందులో వేసి ఉడికించడం వల్ల సమయంతో పాటు గ్యాస్ కూడా అదా అయ్యి.. నిమిషాల వ్యవధిలోనే కూర రెడీ అయిపోతుంది.
సాధారణంగా మాంసాహారం చాలా ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. ఇతర వంటకాలతో పోలిస్తే 2 లేదా 3 రెట్లు గ్యాస్ దీనికి ఖర్చు అవుతుంది. అదే చికెన్ లేదా మటన్ కర్రీని కుక్కర్ లో వండటం వల్ల గ్యాస్ ను ఆదా చేసుకోవచ్చు. ఇతర గిన్నెల్లో కంటే కుక్కర్ లో అయితే 15-20 నిమిషాల్లోనే మాంసం మెత్తగా ఉడుకుతుంది. మీ అభిరుచికి తగ్గట్లు చికెన్ లేదా మటన్ కర్రీకి అవసరమైన పదార్థాలు కుక్కర్ లో వేసేస్తే రుచికరమైన ఆహారం మీకోసం సిద్ధమైపోతుంది.
సాధారణంగా ఆలూ కర్రీని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. అన్నంతో పాటు రోటీ, చపాతీల్లోకి సైతం ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే బంగాళదుంపలను విడిగా ఉడికించి మళ్లీ కూర వండకుండా నేరుగా కుక్కర్లోనే తాలింపు వేసి ఉడికించడం వల్ల గ్యాస్ ఆదా అవుతుంది.
Also Read: iPhone 17 Pro: ఐఫోన్ 17 ప్రోపై భారీ డిస్కౌంట్.. అమెజాన్లో బంపర్ ఆఫర్.. త్వరపడండి
ప్రస్తుతం పండుగ సీజన్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా దేవుడికి నైవేథ్యంగా పొంగలి లేదా పరమాన్నం వండుతుంటారు. అయితే దీనిని గిన్నెల్లో కాకుండా కుక్కర్ లో చేయడం ద్వారా గ్యాస్ ను కొద్దిమేర సేవ్ చేయవచ్చు. బియ్యం, పప్పును కలిపి కుక్కర్లో మెత్తగా ఉడికించి ఆ తర్వాత బెల్లం కలపడం ద్వారా తక్కువ మంటపై త్వరగా తీపి వంటకాలను తయారు చేసేందుకు వీలు కలుగుతుంది.
Also Read: Janasena Controversy: త్రిసభ్య కమిటీ విచారణ తుస్సేనా.. జనసేన ఎమ్మెల్యేలపై సేనాని మౌనం ఎందుకో..!