E-Paper
Advertisement

5G network:- 5జీ సేవలే ఆ దేశ టార్గెట్.. 2030 లోపు..

5G network:- 5జీ సేవలే ఆ దేశ టార్గెట్.. 2030 లోపు..
Advertisement

5G network:- టెలికాం సంస్థలు ఒకటితో ఒకటి పోటీపడుతూ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒక టెలికాం సంస్థ ఒక ఆఫర్‌ను ప్రకటిస్తే.. దానికి మించిన ఆఫర్‌తో మరో సంస్థ సిద్ధంగా ఉంటుంది. ప్రస్తుతం టెలికాం సంస్థలతో పాటు కస్టమర్ల దృష్టి కూడా 5జీ పైనే ఉంది. 5జీ సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అందుకే తాజాగా ఒక దేశ ప్రభుత్వం చొరవ తీసుకొని 5జీ సేవలపై దృష్టిపెట్టింది.

2030 లోపు అందరికీ 5జీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని యూకే ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ముందుగా యూకేలోని ఎక్కువగా ప్రజలు ఉన్న ప్రదేశాల్లో స్టాండలోన్ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యూకే ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 4జీ నెట్‌వర్క్ కోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను తొలగించి 5జీ సేవల కోసం పూర్తిగా కొత్త కనెక్టివిటీని అందించాలని అనుకుంటోంది. 5జీ ప్లస్ పేరుతో ఒక అండర్‌లయింగ్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనుంది.

Advertisement

ప్రస్తుతం బేసిక్ 5జీ సేవలు యూకేలోని దాదాపు 77 శాతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. 5జీ కనెక్టివిటీని వ్యాప్తి చేయడం కోసం ప్రభుత్వం దాదాపు 150 మిలియన్ యూరోల నిధులను విడుదల చేసింది. ఇందులో మూడోవంతు 5జీ పై ప్రయోగాలు చేయడానికి ఉపయోగించాలని టెక్ నిపుణులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ నిధులలోని 40 మిలియన్ యూరోలు వ్యాపార సంస్థలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో 5జీని పెంపొందించడానికి ఉపయోగించాలని తెలిపింది.

యూకే ప్రభుత్వంతో పాటు టెలికాం సంస్థలు కూడా ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం వారు హువాయ్ సంస్థకు సంబంధించి ఉపయోగిస్తున్న మౌలిక సదుపాయాలు అన్ని 2027లోపు తీసి పక్కన పెట్టేయాలని యూకే ప్రభుత్వం తెలిపింది. 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చి, వెంటనే 6జీ గురించి కూడా సన్నాహాలు మొదలుపెట్టాలని అనుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పోటీని తట్టుకోవాలంటే ఈ మాత్రం ముందు జాగ్రత్తగా ఉండాలని అంటోంది యూకే ప్రభుత్వం.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×