WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తీసుకొస్తున్న కొత్త Usernames ఫీచర్ ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ ఫీచర్కు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) లేవనెత్తిన ప్రశ్నలకు మెటా సంస్థ తాజాగా తమ సమాధానాలను సమర్పించింది. మెటా అందించిన నివేదికను ప్రభుత్వ అధికారులు ఇప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు.
సాధారణంగా వాట్సప్లో ఎవరితోనైనా చాట్ చేయాలన్నా.. గ్రూప్లో యాడ్ అవ్వాలన్నా ఫోన్ నెంబర్ తప్పనిసరి. అయితే ఈ కొత్త ఫీచర్ వస్తే.. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్) లాగా ప్రతి ఒక్కరూ @ గుర్తుతో ఒక ప్రత్యేకమైన యూజర్నేమ్ను క్రియేట్ చేసుకోవచ్చు. దీంతో అవతలి వారికి మన ఫోన్ నెంబర్ తెలియకుండానే కేవలం యూజర్నేమ్ ద్వారా చాటింగ్ లేదా కాల్స్ మాట్లాడుకునే వీలుంటుంది. ఇది పూర్తిగా యూజర్ల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది.
ఈ ఫీచర్ యూజర్ల ప్రైవసీని పెంచుతుందని మెటా చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వం మాత్రం దీనివల్ల సైబర్ నేరాలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. గత వారం మెటా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ భద్రత, ప్రైవసీ, స్కామర్ల ముప్పు గురించి గట్టిగానే ప్రశ్నించింది. సాంకేతిక భద్రతలపై పూర్తి వివరాలు ఇవ్వాలని మూడు రోజుల గడువు కూడా విధించింది.
Also Read: స్మార్ట్ టీవీల్లో ఈ సీక్రెట్ ఫీచర్ గురించి తెలిస్తే.. ఇకపై సినిమా చూసే స్టైలే మారిపోతుంది!
సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యూజర్నేమ్స్ వల్ల మోసగాళ్లు ప్రముఖ సంస్థలు, ప్రభుత్వ శాఖలు లేదా సెలబ్రిటీల పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించి ప్రజలను బురిడీ కొట్టించే ప్రమాదం ఉంది. అయితే ప్రముఖ బ్రాండ్లు, ప్రభుత్వ ఖాతాల పేర్లను ఇతరులు వాడకుండా ముందే ప్రొటెక్ట్ చేస్తామని మెటా అంటోంది. కానీ ఈ రక్షణ ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
మెటా ఇచ్చిన సమాధానాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సమీక్షించిన తర్వాతే ఈ ఫీచర్కు భారతదేశంలో అనుమతి ఇవ్వాలా వద్దా అనేదానిపై తుది నిర్ణయం తీసుకోనుంది. దేశంలో డిజిటల్ చట్టాలు కఠినంగా మారుతున్న తరుణంలో, ప్రభుత్వం యూజర్ల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇస్తోంది. ఒకవేళ అంతా సవ్యంగా ఉంటేనే వాట్సప్ యూజర్నేమ్స్ ఫీచర్ భారతీయులకు అందుబాటులోకి వస్తుంది.
Also Read: 6000mAh బ్యాటరీ, క్రేజీ లుక్స్.. RCB ఫ్యాన్స్ కోసం భారత్లో స్పెషల్ ఎడిషన్ లాంచ్!