Xiaomi Price Hike| ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ పరిశ్రమ ఇప్పుడు పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. మెమరీ చిప్ల ధరలు గత కొన్ని నెలల్లో గణనీయంగా పెరిగాయి. ఈ ధర పెరుగుదల వల్ల స్మార్ట్ఫోన్ల తయారీ ఖర్చు పెరిగింది. చైనీస్ టెక్ కంపెనీ షావోమీ ఇటీవల ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది. భవిష్యత్తులో స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని సూచించింది. షామోమీ CEO లీ జున్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వివరించాడు. కాంపోనెంట్ల ధరలు పెరిగితే ఫోన్ల ధరలు ప్రభావితమవుతాయని ఆయన అన్నారు. అయితే కస్టమర్లపై పెద్ద భారం పడకుండా చూస్తామని చెప్పారు.
మెమరీ చిప్ల ధరలు పెరగడానికి ప్రధాన కారణం AI టెక్నాలజీ వేగంగా పెరగడం. ప్రపంచవ్యాప్తంగా AI సర్వర్లు, డేటా సెంటర్లు, హై-పెర్ఫామెన్స్ మెషిన్లకు అడ్వాన్స్ మెమరీ చిప్ల అవసరం పెరిగింది. డిమాండ్ సప్లై కంటే ఎక్కువగా ఉండటం వల్ల ధరలు గణనీయంగా పెరిగాయి. స్మార్ట్ఫోన్ తయారీదారులు ఈ చిప్లపై ఎక్కువగా ఆధారపడతారు. ఈ ధర పెరుగుదల వల్ల తయారీ ఖర్చు పెరిగింది.
షావోమీ సిఈవో ప్రకారం.. మెమరీ చిప్లు స్మార్ట్ఫోన్లో అత్యంత ఖరీదైన కాంపోనెంట్లలో ఒకటి. ప్రతి ఆధునిక ఫోన్లో RAM, స్టోరేజ్ చిప్లు ఉంటాయి. మెమరీ ధరలు పెరిగితే.. స్మార్ట్ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ల మొత్తం తయారీ ఖర్చు పెరుగుతుంది. షావోమి లాంటి ఫోన్ తయారీ కంపెనీల వ్యాపారంపై ప్రభావం చూపుతుంది.
మొత్తం ధర పెరుగుదల భారం కస్టమర్లపై పూర్తిగా మోపకూడదని భావిస్తోంది. సప్లై చైన్ నెట్వర్క్ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. కాంపోనెంట్ సప్లయర్లతో మెరుగైన భాగస్వామ్యాలు చేసి ధరలను స్థిరంగా ఉంచాలని ప్రయత్నిస్తోంది. ఉత్పత్తి నిర్వహణను మెరుగుపరచడం ద్వారా అనవసర ఖర్చులను తగ్గిస్తామని, సప్లయర్లతో ధరల ఒప్పందాలు చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు షావోమీ తెలిపింది. ధర మార్పులు జాగ్రత్తగా, కస్టమర్లపై తక్కువ ప్రభావంతో ఉండేలా చూస్తుంది.
మెమరీ చిప్ ధరల పెరుగుదల మొత్తం కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమను ప్రభావితం చేస్తోంది. చాలా బ్రాండ్లు ఇదే సప్లై చైన్పై ఆధారపడ్డాయి. కొన్ని కంపెనీలు లాభాలపై ఒత్తిడి గురించి ఇప్పటికే నివేదించాయి. కొత్త డివైస్ల లాంచ్లను ఆలస్యం చేసే అవకాశం ఉంది. చౌక స్మార్ట్ఫోన్లు తయారీ ఖర్చు పెరిగినప్పుడు రావడం కష్టమవుతుంది. భవిష్యత్తులో స్మార్ట్ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎంట్రీ-లెవల్ ఫోన్లపై ఎక్కువ ప్రభావం పడవచ్చు.
Also Read: వాట్సాప్లో యాడ్స్తొ విసిగిపోతున్నారా? ఇలా బ్లాక్ చేయండి
ధరలు పెంచినా కస్టమర్లకు మంచి వాల్యూ ఇస్తామని షావోమీ హామీ ఇచ్చింది. మార్కెట్లో పోటీపడేలా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అఫర్డబుల్ ధరలు, అడ్వాన్స్ టెక్నాలజీ రెండూ బ్యాలెన్స్ చేస్తుంది. ధరల పెరుగుదల త్వరలోనే ఉండవచ్చు. అందుకే షావోమి బ్రాండ్లైన్ రెడ్మి, పోకో ఫోన్స్ కొనాలనుకునేవారు త్వరగా కొనడం మంచిది. కాంపోనెంట్ ధరలు పెరిగితే ఫోన్ల ధరలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది.