E-Paper
Advertisement

Rcb-Ms Dhoni: ధోనికి మరో ఘోర అవమానం…స్టంప్స్ నుంచి సిక్సులు అన్ని ఫిక్సింగ్ అంటూ!

Rcb-Ms Dhoni: ధోనికి మరో ఘోర అవమానం…స్టంప్స్ నుంచి సిక్సులు అన్ని ఫిక్సింగ్ అంటూ!

Rcb-Ms Dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మహేంద్రసింగ్ ధోనీకి అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయి. ఈసారి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరడం ఏమో కానీ… చెన్నై సూపర్ కింగ్స్ అలాగే మహేంద్ర సింగ్ ధోనీనీ టార్గెట్ చేసి…RCB అభిమానులు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మహేంద్ర సింగ్ ధోని క్యారెక్టర్ ను బ్యాడ్ చేసేలా… పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం, స్టేడియంలో ప్లకార్డులు చూపించడం, రెండు ఏళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించాలంటే… మహేంద్రసింగ్ ధోని ఉద్దేశించి జెర్సీలను తయారు చేయడం లాంటివి చేసి… కొత్త ట్రోలింగ్ తెర లేపారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు.

Also Read: Sanjiv Goenka : 27 కోట్లు బొక్క… చేసేదేమీ లేక పంత్ కు మసాజ్ చేస్తున్న లక్నో ఓనర్

చీటర్ ధోని… పిక్చర్ ధోని అంటూ ట్రోలింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో భాగంగా మంగళవారం రోజున చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైట్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పైన రాజస్థాన్ రాయల్స్ జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు వచ్చిన బెంగళూరు అభిమానులు… ధోనిని టార్గెట్ చేసి మళ్ళీ ట్రోల్ చేశారు. ఓ వ్యక్తి అయితే.. మహేంద్ర సింగ్ ధోని పెద్ద పిక్చర్ అంటూ ప్ల కార్డు చూపించాడు. స్టంపింగ్ నుంచి సిక్సర్ల వరకు అంతా ఫిక్సింగ్ అంటూ… స్టేడియంలో రచ్చ చేశాడు బెంగళూరు అభిమాని. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బెంగళూరు పై చెన్నై అభిమానులు ఫైర్

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై అనవసరంగా పోస్టులు అలాగే కామెంట్లు పెడుతున్న బెంగళూరు అభిమానులకు చెన్నై ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు. ఒక కప్పు కూడా గెలవని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు కొంచెం కూడా సిగ్గు లేదని చురకలు అంటిస్తున్నారు. దమ్ముంటే.. కప్పు గెలిచి చూపించాలని… సవాలు విసురుతున్నారు మహేంద్రసింగ్ ధోని అభిమానులు. ఐదు టోర్నమెంటులు తీసుకువచ్చిన మహేంద్ర సింగ్ ధోని గురించి మాట్లాడే హక్కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఏమాత్రం లేదని ఫైర్ అవుతున్నారు.

Also Read: Abhishek vs Digvesh: నీకు 10.. నాకు 10 అంటూ పంచాయితీ తెంపిన BCCI VP రాజీవ్ శుక్లా

ఐపీఎల్ 2025లో దారుణంగా విఫలమైన చెన్నై

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో మహేంద్రసింగ్ ధోని కెప్టెన్ గా వ్యవహరిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ అత్యంత దారుణంగా విఫలమవుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగిన మొదటి జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు.. చెత్త రికార్డు నమోదు చేసుకుంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటివరకు 13 మ్యాచులు ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. ఇందులో మూడు మాత్రమే గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్… 10 మ్యాచ్ లలో ఓడిపోయింది. అటు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కూడా బ్యాటింగ్లో పెద్దగా రాణించడం లేదు. ఈ తరుణంలోనే బెంగుళూరు అభిమానులు రెచ్చిపోతున్నారు.

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×