Aakash Chopra: టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (India vs Afghanistan) మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ (Afghanistan tour of India 2026) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2027 వన్డే వరల్డ్ కప్ (2027 ODI World Cup) కోసం టీం ఇండియాను సిద్ధం చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగానే పసికూన జట్ల నుంచి, పెద్ద జట్లతో సిరీస్ లు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఇవాళ ఈ రెండు జట్ల మధ్య లక్నో లోని ఏకనా స్టేడియం (Bharat Ratna Shri Atal Bihari Vajpayee Ekana Cricket Stadium, Lucknow) వేదికగా బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆకాశ్ చోప్రా ( Aakash Chopra) సంచలన వ్యాఖ్యలు చేశారు. వాషింగ్టన్ సుందర్ ను (Washington Sundar) అసలు టీం ఇండియాలో ఎందుకు ఉంచారు..? వాడి స్థానంలో మరొకడిని తీసుకుంటే బాగుండు అంటూ సూచనలు చేశారు. వెంటనే వాషింగ్టన్ సుందర్ ను తప్పించి, కుల్దీప్ యాదవ్ ను తుది జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆకాశ్ చోప్రా. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ (India vs Afghanistan) ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ పై (Washington Sundar) ఆకాశ్ చోప్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలు వాడిని ఎందుకు సెలెక్ట్ చేశారని ఇబ్బంది పడ్డారు. పేరుకే ఆల్ రౌండర్.. కానీ సుందర్ వల్ల రూపాయి లాభం లేదని ఫైర్ అయ్యారు. బ్యాటింగ్ చేయలేడు.. అటు బౌలింగ్ ఇస్తే వికెట్లు పడగొట్టలేడని పరువు తీశారు. అనవసరంగా వాషింగ్టన్ సుందర్ ను తీసుకున్నారని సీరియస్ అయ్యారు. గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్న ప్లేయర్ లందరికీ అవకాశాలు ఇస్తున్నారు తప్ప… టాలెంట్ ఉన్నవాళ్లను మాత్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహించారు ఆకాశ్ చోప్రా. వాషింగ్టన్ సుందర స్థానంలో కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav) లాంటి వాళ్లకు అవకాశం ఇస్తే వికెట్లు తీస్తారని సూచనలు చేశారు. ఆ దిశగా టీమిండియా యాజమాన్యం అడుగులు వేయాలని కోరారు. రిజర్వు బెంచ్ పైన కూర్చున్న కుల్దీప్ యాదవ్ కు ఇవాళ జరిగే రెండో వన్డే నేపథ్యంలో చాన్స్ ఇవ్వాలని కోరారు. వాషింగ్టన్ సుందర్ ను పక్కన పెట్టాలని వెల్లడించారు. అప్పుడే టీమిండియా విక్టరీ సులభం అవుతుందని చోప్రా వివరించారు.