Shreyas Iyer: టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. ఇతడు టీమిండియాకు వైస్ కెప్టెన్ గా తాజాగా ఎంపిక అయ్యాడు. ఐపీఎల్ లో కేకేఆర్ జట్టుకు కెప్టెన్ గా గతంలో ఉండేవాడు. ప్రస్తుతం పంజాబ్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్ ను 2025 ఐపీఎల్ సమయంలో కొనుగోలు చేశారు. శ్రేయస్ అయ్యర్ ను కొనుగోలు చేసిన వెంటనే పంజాబ్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది ప్రీతి జంట. ఈ నేపథ్యంలోనే మొన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్లలో ఫైనల్ వరకు వెళ్లారు. ఆ సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు చేతిలో రనరప్ గా నిలిచారు.
శ్రేయస్ అయ్యర్ నటి ధనశ్రీ వర్మతో గతంలో ఎఫైర్ పెట్టుకున్నట్టుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. ధనశ్రీ వర్మ చాహల్ మాజీ భార్య. అయితే ఒకానొక సమయంలో శ్రేయస్ ధనశ్రీ వర్మ ఇద్దరూ కలిసి బయట కొన్ని సందర్భాలలో కెమెరా కంటపడ్డారు. దీంతో వీరిద్దరూ సీక్రెట్ గా రిలేషన్ కొనసాగిస్తున్నారని వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నట్టుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. ఈ విషయం పైన శ్రేయస్ కానీ ధనశ్రీ వర్మ కానీ ఈ విషయం పైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక చాహల్ ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకుల అనంతరం చాహల్ ఆర్జే మహ్వాష్ తో రిలేషన్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నట్లుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి. త్వరలోనే చాహల్ ఆర్జే మహ్వాష్ వివాహం కూడా చేసుకోబోతున్నట్లుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చాహల్ రిలేషన్ కొనసాగిస్తున్న అమ్మాయి ఆర్జే మహ్వాష్ తో కూడా శ్రేయస్ అయ్యర్ గతంలో తిరిగినట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్జే మహ్వాష్, శ్రేయస్ ఇద్దరూ కలిసి కొన్ని సందర్భాలలో బయట కూడా కనిపించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే చాహల్ ఏ అమ్మాయిని పడితే ఆ అమ్మాయిని శ్రేయస్ అయ్యర్ పడుతున్నట్లుగా కొన్ని రకాల వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.
తాజాగా దీపావళి సందర్భంగా శ్రేయస్ అయ్యర్ టాలీవుడ్ నటి ఆదాశర్మ ఇద్దరు కలిసి ఓ పాటలో కలిసి నటించారు. దీనిని ఫ్రీ ఫైర్ ఇండియా అధికారిక ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా అందరికీ షేర్ చేసుకుంది. ఫ్రీ ఫైర్ ఈ వీడియోతో పాటు క్యాప్షన్ లో “నిర్వాహకుడు మరో దీపావళి సర్ప్రైజ్ తో వచ్చారు. ‘బుల్లెట్ ఆఫ్రికానా’ ఫ్రీ ఫైర్ మ్యాక్స్ దీపావళి గీతం త్వరలో వస్తుంది అని క్యాప్షన్ చేశారు. దీంతో శ్రేయస్ అయ్యర్, ఆదాశర్మ ఫ్రీ ఫైర్ దీపావళి సర్ప్రైజ్ లో ఓ భాగమని వారు ‘బుల్లెట్ ఆశికానా’ పాటను రిలీజ్ చేయబోతున్నట్లుగా ఫ్రీ ఫైర్ పేర్కొంది. దీనికి ఫ్రీ ఫైర్ ‘దీపావళి గీతం’ అని పేరును పెట్టారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది.
Also Read: Team India -Divorce: విడాకులు తీసుకున్న మరో టీమిండియా ప్లేయర్…భార్య లేకుండానే దీపావళి వేడుకలు
అయితే ఈ పాటలో శ్రేయస్ అయ్యర్, ఆదాశర్మ ఇద్దరు కలిసి కాస్త రొమాంటిక్ గా నటించారు. దీంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ పాటలో ఇద్దరు చాలా క్లోజ్ గా రొమాంటిక్ గా కనిపించడంతో ప్రతి ఒక్కరూ వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారని త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారని అనేక రకాల వార్తలను వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ కు సంబంధించిన ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. దీనిపైన శ్రేయస్ అయ్యర్ ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.