Mohsin Naqvi: కుక్క తోక ఎప్పుడు వంకరే.. అనే సామెత పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ( Pakistan Cricket Board
) సరిగ్గా సరిపోతుంది. ఇండియా చేతిలో ఓడిపోయిన తర్వాత జట్టులో లోపాలను సరి చేసుకోవాల్సింది పోగా, టీమిండియాతో పాటు శ్రీలంక పై ( Srilanka) ఏడుస్తోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవడానికి కారణం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ( Anura Kumara Dissanayake) అంటూ బాంబు పేల్చారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ). శ్రీలంక ఆడమంటేనే టీమిండియాతో ( Team India) మ్యాచ్ ఆడమని..తీరా ఇప్పుడు ఓడిపోవడంతో తమ పరువు పోయిందని మండిపడ్డారట. దీని అంతటికి కారణం శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అంటూ విమర్శలు చేశారట మొహ్సిన్ నఖ్వీ. తాజాగా జరిగిన బోర్డు మీటింగ్ లో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమారను ఉద్దేశించి మొహ్సిన్ నఖ్వీ బండబూతులు తిట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
Also Read: IND VS PAK: ఇక పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెలవడం చేతకాక, చివరకు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో భాగంగా కొలంబో వేదికగా మొన్న శివరాత్రి రోజున పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. 61 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా నేరుగా సూపర్ 8 లోకి దూసుకు వెళ్లింది. అటు పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా తయారైంది. నమీబియా తో తన తర్వాతి మ్యాచ్ లో పాకిస్తాన్ విజయం సాధిస్తేనే, సూపర్ 8లోకి దూసుకు వెళ్తుంది. లేకపోతే ఇంటి దారి పట్టాల్సిందే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే టీమిండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోవటాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జీర్ణించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ( Anura Kumara Dissanayake)ను దోషిగా చేస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలంక కారణంగానే ఇండియా చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీలంకలో రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఆధ్వర్యంలో జరిగింది.
దీనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేను దోషిగా చేస్తూ మొహ్సిన్ నఖ్వీ ఫైర్ అయ్యారట. మీరు ఇండియాతో ఆడం అంటేనే ఆడాం.. కానీ ఇప్పుడు మా వాళ్ళు ఓడిపోయారని ఫైర్ అయ్యారట. మేము బహిష్కరణ చేస్తామన్నా కూడా మీరు వినలేదు.. ఇప్పుడు ప్రతిఫలం మాకు వ్యతిరేకంగా వచ్చిందని నిప్పులు జరిగారట మొహ్సిన్ నఖ్వీ. అయితే దీనికి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే కూడా రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. మీ చేతకానితనం వల్ల ఓడిపోయారు తప్ప.. తమ వల్ల కాదని కౌంటర్ ఇచ్చారట.
BIG NEWS 🚨 After defeat, PCB puts all the blame on Srilankan President 😭😂
Mohsin Naqvi told him "It’s because of you the India-Pakistan match happened as scheduled" pic.twitter.com/kFHjkuBAL2
— News Algebra (@NewsAlgebraIND) February 17, 2026