E-Paper
Advertisement

RCB-Anushka Sharma: RCB జ‌ట్టును కొనుగోలు చేయ‌నున్న అనుష్క‌..ఎన్ని కోట్లంటే ?

RCB-Anushka Sharma: RCB జ‌ట్టును కొనుగోలు చేయ‌నున్న అనుష్క‌..ఎన్ని కోట్లంటే ?
Advertisement

RCB-Anushka Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ కంటే ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును కొనుగోలు చేసేందుకు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ స్కెచ్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌ బెంగళూరు జట్టులో ( RCB Team) మూడు శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు ఆమె సిద్ధమయ్యారట. ఈ మేరకు ఆర్సిబి యాజమాన్యాన్ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. విరాట్ కోహ్లీ వద్దని చెప్పినా కూడా అనుష్క శర్మ ( Anushka Sharma ) మాత్రం.. తాను సంపాదించిన డబ్బులతో వాటాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: Rinku Singh AI Video Controversy: దేవుళ్ల‌పై ఆ పోస్టులు…రింకు సింగ్ అరెస్ట్ కు రంగం సిద్ధం..అస‌లు ఏంటి ఈ వివాదం ?

బెంగళూరు జట్టుపై కన్నేసిన అనుష్క శర్మ ?

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కొత్త యాజమాని రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న యాజమాన్యం డియాజియో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును విక్రయించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేసింది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ ప్రారంభం అయ్యేసరికి బెంగళూరు జట్టుకు కొత్త ఓనర్ కచ్చితంగా వస్తాడు. ఈ జట్టును కొనుగోలు చేసేందుకు దాదాపు 1800 కోట్ల వరకు ఖర్చు అవుతుందట. అంటే ఆర్సిబి జట్టు వ్యాల్యూ 1800 కోట్లు అన్నమాట.

ఈ నేపథ్యంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మూడు శాతం వాటాలను కొనుగోలు చేసేందుకు విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ నిర్ణయం తీసుకున్నారట. ఈ మూడు శాతం వాటాల కోసం దాదాపు 100 కోట్ల ఖర్చు అవుతుందని సమాచారం. ఈ మేరకు డబ్బులు కూడా ఆమె సిద్ధం చేసుకున్నారట. ఆమె హీరోయిన్ దశ నుంచి ఇప్పటివరకు సంపాదించుకున్న డబ్బులు అన్ని బెంగళూరు జట్టు ( Royal Challengers Bengalur ) కోసం పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే అతి త్వరలోనే బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ కూడా ఓనర్ కాబోతున్నాడు అన్నమాట.

అనుష్క ఒక్కటే కాదు… ఆ బాలీవుడ్ హీరో కూడా

Advertisement

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ( Royal Challengers Bengalur ) కొనుగోలు చేసేందుకు అనుష్క శర్మ నిర్ణయం తీసుకోగా…. అంతకుముందే బాలీవుడ్ హీరో రన్ బీర్ కపూర్ కూడా కన్నేశారు. ఆయన దాదాపు 8 శాతం బెంగళూరు వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారట. దీనికోసం దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు కాబోతున్నట్లు సమాచారం. ఇక జట్టు మెజారిటీ వాటాలను ముఖేష్ అంబానీ ఫ్యామిలీ కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఐపీఎల్ 2026 టోర్న‌మెంట్ మార్చి 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read: BCCI Central Contract: ‘A+’ కేటగిరీ ఎత్తివేత‌..ప్లేయ‌ర్ల జీతాల్లో భారీ కోత..ఆ స్లాబ్ లోకి రోహిత్‌, కోహ్లీ !

 

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

టీమిండియా ప్లేయర్లకు అవమానం…ఓయో రూముల్లోనే బస?

బీసీసీఐకి డ‌బ్బుల పొగ‌రెక్కువ‌…ఎవ‌రినైనా కొనేసి, టీమిండియా గెలిచేలా చేస్తుంది!

గౌతమ్ గంభీర్ దుర్మార్గుడు, వీధి రౌడీలా బిహేవ్ చేస్తాడు

ఇండియాలో హిందూ రాజ్యం న‌డుస్తోంది…షాహిద్ అఫ్రిది సంచ‌ల‌నం !

విడాకులు ఇవ్వ‌డం, కొత్త అమ్మాయిల‌తో తిర‌గ‌డం త‌ప్ప పాండ్యాకు ఏదీ చేత‌కాదు

భార‌త్ కు ఎదురుదెబ్బ‌…ఆసియా క్రీడల్లోనూ మెడ‌ల్స్ ఇవ్వ‌నున్న మొహ్సిన్ నఖ్వీ ?

వివాదంలో శ్రేయస్ అయ్యర్.. అసభ్య సైగలు చేస్తూ దొరికిపోయిన కెప్టెన్

ష‌మీ, భువ‌నేశ్వ‌ర్ కుమార్ ప‌ని అయిపోయింది..ఇక రిటైర్మెంట్ ఇచ్చేయండి

Big Stories

Advertisement
×