E-Paper
Advertisement

Asian Para Games : ఆసియా పారా గేమ్స్.. భారత్ పతకాల సెంచరీ..

Asian Para Games : ఆసియా పారా గేమ్స్.. భారత్ పతకాల సెంచరీ..
Advertisement

Asian Para Games : హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్‌లో చివరి రోజులో భారత్ అదరగొట్టింది. పురుషుల 400 మీటర్ల T47 ఫైనల్‌లో దిలీప్ మహదు గావిట్ సత్తాచాటడంతో భారత్ మరో మైలురాయిని సాధించింది. భారత్ పారా-అథ్లెట్లు 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్యాలతో 111 పతకాలను సాధించారు. నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఆరు కాంస్య పతకాలతో చివరి రోజు భారత్ మొత్తం 12 పతకాలు సాధించింది.

పురుషుల 400 మీటర్ల T47 ఈవెంట్‌లో గావిట్ 49.48 సెకన్లలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఇందులో అతను ఇండోనేషియాకు చెందిన నూర్ ఫెర్రీ ప్రదానా, శ్రీలంకకు చెందిన మరవాకా సుబాసింగ్ వరుసగా రజతం, కాంస్యాలతో గెలుపొందాడు. ఆసియా పారా గేమ్స్‌లో భారత్ తొలిసారిగా 100 పతకాల మార్కును చేరుకుంది. 2018లో 15 స్వర్ణాలు, 24 రజతాలు, 33 కాంస్య పతకాలతో 72 పతకాలు సాధించింది. ఇదే భారత్ అత్తుత్తమ ప్రదర్శన.

Advertisement

పారా అథ్లెటిక్స్‌లో నీరజ్ యాదవ్ పురుషుల జావెలిన్ త్రో F55లో స్వర్ణం సాధించాడు. టేక్ చంద్ పురుషుల జావెలిన్ త్రో F55లో కాంస్యం కైవసం చేసుకున్నాడు. పూజ ..మహిళల 1500 మీటర్ల T20లో కాంస్యం గెలుచుకుంది.
పతకాలలో ఎక్కువగా చెస్‌లో 7 పతకాలు వచ్చాయి . ఇందులో రెండు స్వర్ణాలు, రజతం ,నాలుగు కాంస్యాలు ఉన్నాయి. ర్యాపిడ్ V1-B1 ఈవెంట్‌లలో పురుషుల, మహిళల జట్లు వరుసగా స్వర్ణం, కాంస్యం గెలుచుకున్నాయి. వ్యక్తిగత పతకాలు దర్పణ్ ఇనానికి పారా చెస్ B1లో స్వర్ణం దక్కింది.సౌందర్య ప్రధాన్ కు పారా చెస్ B1లో రజతం వచ్చింది. అశ్విన్ మక్వానా కు పారా చెస్ B1లో కాంస్యం, కిషన్ గంగోలి పురుషుల పారా చెస్ B2లో కాంస్యం దక్కాయి. పీఆర్‌3 మిక్స్‌డ్ డబుల్ స్కల్స్‌లో అనిత, నారాయణ కొంగనపల్లె రెండో స్థానంలో నిలిచారు. రోయింగ్‌లో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది.

పారా అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.. ఈ విజయం మన అథ్లెట్ల సంపూర్ణ ప్రతిభ, కృషి , దృఢ సంకల్పం ఫలితంగా సాధ్యమైందని పేర్కొన్నారు. పట్టుదలతో ప్రయత్నిస్తే.. యువతకు సాధ్యం కానిది ఏదీ లేదని మోదీ స్పష్టం చేశారు.

Tags

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

ఎయిర్‌టెల్ 5G యూజర్లకు అలర్ట్.. హాట్‌స్పాట్ ఆన్ చేస్తే డేటా కట్ అంటూ ప్రచారం..!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×