E-Paper
Advertisement

WTC Final:డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్.. ప్రత్యర్థి టీమిండియానేనా?

WTC Final:డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్.. ప్రత్యర్థి టీమిండియానేనా?
Advertisement

WTC Final:వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఆస్ట్రేలియా దాదాపు ఖారారు చేసుకుంది. దక్షిణాఫ్రికాపై 3 టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో గెలుచుకున్న కంగారూలు… డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 75.56 శాతంతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. సౌతాఫ్రికా మాత్రం 48.72 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయి… ఫైనల్ చేరే అవకాశాలను క్లిష్టం చేసుకుంది.

ప్రస్తుతం డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో 58.93 శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌పై టెస్ట్ సిరీస్‌ విజయంతో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది. ఇక శ్రీలంక 55.33 శాతం పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 46.97 శాతం పాయింట్లతో ఇంగ్లండ్‌ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్‌ పర్యటనలో సౌతాఫ్రికా
0-2 తేడాతో ఓడిపోవడంతో… భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు మెరుగయ్యాయి. కాకపోతే… మూడో స్థానంలో ఉన్న శ్రీలంక నుంచి ఇప్పుడు టీమిండియాకు ముప్పు ఉంది.

Advertisement

సొంతగడ్డపై జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4-1 తేడాతో ఓడిస్తే… ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా 61.92 శాతం పాయింట్లతో భారత్ డబ్ల్యుటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఇక వచ్చే మార్చిలో న్యూజిలాండ్ పర్యనటకు వెళ్లే శ్రీలంక… రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఒకవేళ కివీస్ మీద లంక రెండు టెస్టులూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేస్తే… 61.11 శాతం పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో భారత్‌ ఓడిపోయినా,
2-2 డ్రాగా ముగించినా… శ్రీలంక డబ్ల్యుటీసీ ఫైనల్‌కు చేరుకుంటుంది.

ఇక వెస్టిండీస్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లో… సౌతాఫ్రికా 2-0 తేడాతో గెలిస్తే… 55.55 శాతం పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు కివీస్ చేతిలో లంక, ఆసీస్ చేతిలో భారత్ ఓడితే… సౌతాఫ్రికా ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ, టీమిండియా ఆడే చివరి నాలుగు టెస్టుల్లో రెండు గెలిచినా… ప్రొటీస్ డబ్ల్యుటీసీ ఫైనల్‌ ఆశలు గల్లంతైనట్లే.

Tags

Related News

కోహ్లీ చెత్త ఫీల్డర్‌.. అత‌ని చేత‌కాని త‌నం వ‌ల్లే..బ్రెండన్ మెక్‌కలమ్ 300 బాదేశాడు!

షేన్ వార్న్, మురళీధరన్ కంటే..స‌చిన్ బౌలింగ్ అత్యంత ప్ర‌మాదక‌రం

స్పాట్ ఫిక్సింగ్ లో అంద‌రూ న‌న్ను బ‌లి చేశారు..2013 సంఘ‌ట‌న‌పై శ్రీశాంత్ సంచ‌ల‌నం !

2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియాను గెలిపించేందుకు కుట్ర‌లు చేశారు!

పాకిస్తాన్ ప‌రువు తీసిన శుభ్‌మన్ గిల్…అంద‌రూ క‌లిసి చేసిన ర‌న్స్ ఒక్క‌డే చేశాడుగా!

పాకిస్తాన్ ను నాశ‌నం చేసింది మైక్ హెసనే..వాడు కూడా ఇండియ‌న్ ఏజెంటే !

పీక‌ల‌దాకా తాగుతూ నైట్ క్ల‌బ్ లో దొరికిన 9 మంది పాకిస్తాన్ క్రికెట‌ర్లు

125 స్పీడ్ తో బౌలింగ్ చేస్తే, నా ఆస్తులు రాసిస్తా… బ్రెట్ లీకి షోయ‌బ్ అక్త‌ర్ స‌వాల్

Big Stories

Advertisement
×