E-Paper
Advertisement

Big Bash League: పాకిస్తాన్ ప్లేయ‌ర్ల పొట్ట‌ కొట్టిన ఆస్ట్రేలియా.. ఇండియాతో భారీ కుట్ర

Big Bash League: పాకిస్తాన్ ప్లేయ‌ర్ల పొట్ట‌ కొట్టిన ఆస్ట్రేలియా.. ఇండియాతో భారీ కుట్ర

Big Bash League:  పాకిస్తాన్ ప్లేయర్లకు మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా చేతిలో ఘోర ఓటమి చవిచూసిన పాకిస్తాన్ ప్లేయర్ల పొట్ట కొట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ లీగ్ 2026-27 టోర్నమెంట్ లో ( Big Bash League) భాగంగా జరిగే తొలి మ్యాచ్ ను ఇండియాలో నిర్వహించేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ( Cricket Australia) నిర్ణయం తీసుకుందట. ఇండియాలోని చెన్నై చేపాక్ స్టేడియంలో ( Chennai Chepauk Stadium) తొలి మ్యాచ్ నిర్వహించేందుకు సిద్ధమైందట. ఈ మేరకు రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే పాకిస్తాన్ ప్లేయర్లకు ఊహించని షాక్ తగిలే ప్రమాదం ఉంది. బిగ్ బాస్ లీగ్ 2026-27 లీగ్ ఇండియాలో నిర్వహిస్తే, పాకిస్తాన్ ప్లేయర్లు హాజరు కావడానికి అనుమతి ఉండబోదు. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య గొడవల నేపథ్యంలో పాకిస్తాన్ ప్లేయర్లకు మోడీ సర్కార్ అనుమతి ఇవ్వడం లేదు. అంటే బిగ్ బాస్ లీగ్ 2026-27 లో పాకిస్తాన్ ప్లేయర్లు ప్రారంభ మ్యాచ్ కు దూరం కాబోతున్నారన్నమాట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read: IND vs PAK cricketers car collection: టీమిండియా, పాక్ క్రికెట‌ర్ల కార్ల క‌లెక్ష‌న్‌, వర్త్ వర్మ వర్త్.. క‌ళ్లు చెదిరిపోవాల్సిందే

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల పొట్ట‌ కొట్టిన ఆస్ట్రేలియా

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ ( Cricket Australia ) సంచలన నిర్ణయం తీసుకుందట. బిగ్ బాస్ లీగ్ 2026-2027 టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఇండియాలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది క్రికెట్ ఆస్ట్రేలియా. చెన్నైలోని చెపాక్ స్టేడియం ( M. A. Chidambaram Stadium) వేదికగా ప్రారంభ మ్యాచ్ నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. అటు చెన్నై చెపాక్ స్టేడియం యాజమాన్యానికి కూడా సమాచారం ఇచ్చారట. బీసీసీఐ పెద్దలతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఈ బిగ్ బాష్ లీగ్ ప్రారంభ మ్యాచ్ ఇండియాలో నిర్వహిస్తే పాకిస్తాన్ ప్లేయర్లు అస్సలు ఆడరు. ఇండియాలో పాకిస్తాన్ ప్లేయర్లు పర్యటించాలంటే కచ్చితంగా మోడీ సర్కార్ అనుమతి కావాలి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అది అసాధ్యం. ఇదే జరిగితే పాకిస్తాన్ ప్లేయర్లు బిగ్ బాష్ 2026-27 ప్రారంభ మ్యాచ్ కు దూరం అవుతారు.

ఇండియాలో నిర్వహించడానికి కారణం ఇదే

భారతదేశంలో క్రికెట్ కు ఉన్న మార్కెట్ ఎక్కడా లేదు. ఎలాంటి టోర్నమెంట్ అయినా సరే ఇండియన్స్ చూసేస్తారు. ఇది గ్రహించిన క్రికెట్ ఆస్ట్రేలియా, బిగ్ బాస్ లీగ్ 2026-2027 ప్రారంభ మ్యాచ్ లో ఇండియాలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇండియాలో జరిగితే వ్యూయర్ షిప్‌ బాగా పెరుగుతుందని వాళ్ళ నమ్మకం. అలాగే స్పాన్సర్ షిప్‌ ఆదాయాన్ని కూడా పెంచుకునే అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయంగా కూడా ఈ టోర్నమెంట్ కు గుర్తింపు వస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్లాన్ చేస్తోంది. అందుకే ఈ నిర్ణయాలు తీసుకుందట క్రికెట్ ఆస్ట్రేలియా.

Also Read: IND VS PAK: ఇక‌ పాకిస్తాన్ కు సిగ్గు రాదు..గెల‌వ‌డం చేత‌కాక‌, చివ‌ర‌కు హిట్ వికెట్ చేసేందుకు కుట్ర‌

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×