E-Paper
Advertisement

BCCI Cash Prize: బీసీసీఐ ఫ్రైజ్ మ‌నీ, టీమిండియా U19 జ‌ట్టుకు అవ‌మానం…మహిళ‌ల జ‌ట్టు కంటే 90 % శాతం త‌క్కువే

BCCI Cash Prize: బీసీసీఐ ఫ్రైజ్ మ‌నీ, టీమిండియా U19 జ‌ట్టుకు అవ‌మానం…మహిళ‌ల జ‌ట్టు కంటే 90 % శాతం త‌క్కువే

BCCI Cash Prize:  అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026 ) విజేతగా టీమిండియా నిలిచిన సంగతి తెలిసిందే. నిన్న అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా ( England U19 vs India U19, Final ) మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో చివరి వరకు పోరాడిన ఇంగ్లాండ్ ఓడిపోగా.. టీమిండియా వంద పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ నేపథ్యంలో ఆరవసారి అండర్ 19 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా టీం ఇండియా అండర్ 19 జట్టు చరిత్ర సృష్టించింది. అయితే ఆరవ సారి టైటిల్ గెలిచిన టీమిండియా జట్టుకు బంపర్ ఆఫర్ తగిలింది. టీమిండియా జట్టుకు బిసిసిఐ భారీ నజరానా ప్రకటించింది.. ఏకంగా 7.50 కోట్ల ప్రైస్ మనీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది బీసీసీఐ. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.

Also Read: Scotland Cricket Team: ఇండియాలో అడుగుపెట్టిన స్కాట్లాండ్‌…పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు ఇక గాజులు వేసుకోవాల్సిందే ( India vs Pakistan)

టీమిండియా జట్టుకు BCCI భారీ నజరానా

అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ఛాంపియన్గా నిలిచిన టీమిండియా జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ నజరానా ప్రకటించింది. ఎవరు ఊహించని రీతిలో 7.5 కోట్ల రూపాయల నగదును ఇచ్చేందుకు ముందుకు వచ్చింది బీసీసీఐ. ఐసీసీ టోర్నమెంట్ గెలిచిన ప్రతిసారి నజరానా ఇస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి, ఇప్పుడు అండర్ 19 టీమ్ ఇండియాకు కూడా భారీ నజరానా ప్రకటించింది. ఈ 7.5 కోట్ల నగదును టీమిండియా ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్, సెలెక్టర్లకు పంపిణీ చేయనున్నారు బిసిసిఐ పెద్దలు. బీసీసీఐ కాసుల వర్షం కురిపించిన నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు సంబరపడిపోతున్నారు.

బీసీసీఐ ప్రకటించిన నజరానాపై విమర్శలు 

అండర్ 19 టీమ్ ఇండియా జట్టుకు బిసిసిఐ ప్రకటించిన 7.5 కోట్ల నజరానా పై విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన మహిళల దటుకు 51 కోట్లు ప్రకటించింది బీసీసీఐ. కానీ పురుషుల అండర్ 19 జట్టుకు మాత్రం వాళ్లకంటే దాదాపు 90% తక్కువ నిధులు ఇవ్వడం విమర్శలకు తావు ఇస్తోంది. మహిళలతో పాటు పురుషులకు కూడా సమానంగా డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు ఫ్యాన్స్.

100 పరుగుల తేడాతో ఫైనల్ మ్యాచ్ లో విజయం

ఐసీసీ అండర్ 19 వన్డే వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న హరారే లోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 411 పరుగుల రికార్డు టార్గెట్ ఇంగ్లాండ్ ముందు ఉంచింది. ఈ సందర్భంగా టీమిండియా కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే సెంచరీ నమోదు చేశాడు. కేవలం 80 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్య వంశీ ఏకంగా 175 పరుగులు సాధించాడు. ఇందులో 15 సిక్సర్లు అలాగే 15 బౌండరీలు ఉన్నాయి. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ తేలిపోయింది. దీంతో ఇంగ్లాండ్ పైన 100 పరుగుల తేడాతో టీమిండియా అండర్-19 జట్టు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆరవసారి అండర్ 19 వన్డే వరల్డ్ కప్ గెలిచిన జట్టుగా టీం ఇండియా అండర్ 19 జట్టు చరిత్ర సృష్టించింది. ఆరవ సారి టైటిల్ గెలిచిన టీమిండియా జట్టుకు బంపర్ ఆఫర్ తగిలింది. ఏకంగా 7.50 కోట్ల ప్రైస్ మనీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది బీసీసీఐ.

Also Read: T20 World Cup 2026: టీ20 ప్ర‌పంచ క‌ప్ షెడ్యూల్ ఇదే, ఆసీస్ కు ఎదురుదెబ్బ‌..టీమిండియా మ్యాచ్ లు ఎక్కడ ఉచితంగా చూడాలంటే

 

Related News

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

Big Stories

×