E-Paper
Advertisement

BCCI :-  క్రికెటర్లను చైనాకు పంపించేది లేదు.. తేల్చి చెప్పిన బీసీసీఐ

BCCI :-  క్రికెటర్లను చైనాకు పంపించేది లేదు.. తేల్చి చెప్పిన బీసీసీఐ

BCCI :- ఏషియన్‌ గేమ్స్‌ ఈ ఏడాది చైనాలో జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 23 నుంచి అక్టోబర్‌ 8 వరకు హాంగ్జౌ వేదికగా ఏషియన్‌ గేమ్స్‌ షెడ్యూల్ విడుదలైంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లానే ఏషియన్‌ గేమ్స్‌లోనూ ఈసారి క్రికెట్‌ను ప్రవేశపెట్టారు. గతేడాది బర్మింగ్‌హమ్‌ కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు మహిళల క్రికెట్‌ జట్టును పంపించింది బీసీసీఐ. ఆ గేమ్స్‌లో ఫైనల్లో ఆస్ట్రేలియాతో చేతిలో ఓడిన హర్మన్‌ సేన సిల్వర్‌ మెడల్‌ గెలుచుకుంది.

కామన్ వెల్త్ గేమ్స్‌లో ఆడించినందుకు ఏషియన్ గేమ్స్ లోనూ క్రికెట్ చేర్చారు. అయితే, ఒక్క క్రికెట్ తప్ప మిగిలిన విభాగాల్లో ఎంట్రీ పేర్లను చైనాకు పంపించారు భారత ఏషియన్‌ గేమ్స్‌ చీఫ్‌ భుపేందర్‌. మెన్, ఉమెన్ క్రికెట్‌ జట్లను చైనాకు పంపించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.

అయితే, ఇండియాతో చైనా వ్యవహారశైలి కారణంగానే క్రికెట్ జట్లను పంపించడం లేదా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. కాని, అది కారణం కాదంటున్నారు. ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగామ్‌-ఎఫ్‌టీపీలో భాగంగానే పంపించడం లేదని బీసీసీఐ తెలిపింది. సెప్టెంబర్ సమయంలో కొన్ని కమిట్‌మెంట్స్‌ ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది బీసీసీఐ.  ఏషియన్‌ గేమ్స్‌ సమయంలోనే ముఖ్యమైన ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఉన్నాయి. అందుకే భారత క్రికెట్‌ జట్లను చైనాకు పంపించకూడదని నిర్ణయించుకున్నామని బీసీసీఐ తెలిపింది.

ఎఫ్‌టీపీ ప్రకారం టీమిండియా మెన్స్‌ జట్టు అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో వన్డే ప్రపంచకప్‌ ఆడనుంది. అదే సమయంలో మహిళల జట్టు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లు ఆడనుంది. అయితే ఏషియన్‌ గేమ్స్‌ కూడా అప్పుడే జరుగుతున్నందున వేరే దారి లేక పోటీల్లో తాము పాల్గొనడం లేదని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

అయితే ఏషియన్‌ గేమ్స్‌కు భారత క్రికెట్ జట్టు తరపున జూనియర్లను పంపిస్తే బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ 1998లో కౌలలంపూర్‌ లో జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత పురుషుల జట్టు పాల్గొంది. అదే సమయంలో పాకిస్తాన్‌తో టొరంటోలో మరో టీమిండియా జట్టు వన్డే సిరీస్‌ను ఆడింది. తాజాగా 2021లో భారత సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు వెళ్లగా.. శిఖర్‌ ధావన్‌ సారధ్యంలో జూనియర్‌ జట్టు శ్రీలంకలో వన్డే సిరీస్‌ ఆడిందని గుర్తు చేస్తున్నారు. 

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×