E-Paper
Advertisement

BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు
Advertisement

BCCI-Mustafizur Rahman:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( IPL 2026) ప్రారంభానికి అంటే ముందు కేకేఆర్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. అందరూ ఊహించినట్లుగానే బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రహమాన్ ( Mustafizur Rahman ) పైన వేటు వేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India ). కేకేఆర్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రహమాన్ ను రిలీజ్ చేయాలని కీలక ఆదేశాలు ఇచ్చింది బీసీసీఐ. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ ను ఐపీఎల్లో ఆడించకూడదని డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ పై వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో ఐపీఎల్ 2026 టోర్నమెంటులో ముస్తాఫిజుర్ రహమాన్ ఆడబోడన్నమాట. కాగా మొన్నటి ఐపిఎల్ మినీ వేలంలో ముస్తాఫిజుర్ రహమాన్ ను 9.20 కోట్లకు కొనుగోలు చేసింది కేకేఆర్.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

ముస్తాఫిజుర్ రెహమాన్ ను తప్పించడం వెనుక అసలు కారణం ఇదే

Advertisement

 

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు నలుగురు హిందువులను బంగ్లాదేశ్ లో ముస్లింలు చంపేశారు. ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో ఇండియా వ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. బంగ్లాదేశ్ ముస్లింలకు వ్యతిరేకంగా ఇండియాలో హిందువులు నిరసనలు తెలుపుతున్నారు. అటు మోడీ ప్రభుత్వం పై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను కాపాడాలని కోరుతున్నారు.  అయితే హిందువులపై బంగ్లాదేశ్ లో దాడులు జరుగుతున్నప్పటికీ.. ముస్తాఫిజుర్ రహమాన్ లాంటి ప్లేయర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో ( Indian Premier League Tournament ) ఎలా ఆడిస్తారని కూడా తీవ్రస్థాయిలో క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.

Advertisement

ముస్తాఫిజుర్ రహమాన్ ను కొనుగోలు చేసిన కేకేఆర్ జట్టు, సహా యజమాని షారుఖ్ ఖాన్ పై కూడా విమర్శలు చేస్తున్నారు. షారుక్ ఖాన్ దేశద్రోహి అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ముస్తాఫిజుర్ రహమాన్ అంశంపై తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India ) నిర్ణయం తీసుకుంది. అతన్ని ఐపిఎల్ టోర్నమెంటులో ఆడించకూడదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేకేఆర్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. 9.20 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన కేకేఆర్.. ఇప్పుడు తీవ్రంగా నష్టపోయింది. బిసిసిఐ ( BCCI) తీసుకున్న నిర్ణయంతో ముస్తాఫిజుర్ రహమాన్ స్థానంలో ( BCCI-Mustafizur Rahman) మరో ప్లేయర్ ను తీసుకోనున్నారు. ఇది ఇలా ఉండగా ముస్తాఫిజర్ రహమాన్ ను ఆడించకూడదని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా హిందూ సంఘాలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఇక పైన పాకిస్తాన్ తో పాటు బంగ్లాదేశ్ ప్లేయర్లను కూడా ఇండియాకు రానివ్వకూడదని కోరుతున్నారు. మన టీమ్ ఇండియా కూడా బంగ్లాదేశ్ లో పర్యటించకుండా చూడాలని సూచనలు చేస్తున్నారు.

Also Read:  Sai Sudharsan Injury: విరిగిన పక్కటెముక.. పెను ప్రమాదంలో సాయి సుదర్శన్..ఐపీఎల్ 2026 నుంచి ఔట్ ?

 

 

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×