E-Paper
Advertisement

BCCI: రోహిత్‌-కోహ్లీతో బీసీసీఐ అత్య‌వ‌స‌ర మీటింగ్‌…షాక్ లో ఫ్యాన్స్‌..అస‌లు ఏం జ‌రుగుతోంది

BCCI:  రోహిత్‌-కోహ్లీతో బీసీసీఐ అత్య‌వ‌స‌ర మీటింగ్‌…షాక్ లో ఫ్యాన్స్‌..అస‌లు ఏం జ‌రుగుతోంది

BCCI:  విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ ఇద్దరితో భారత క్రికెట్ నియంత్రణ మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఇవాళ మధ్యాహ్నం ఇద్దరూ స్టార్ క్రికెటర్లతో బీసీసీఐ అధికారులు సమావేశం కాబోతున్నారు. ఈ మేరకు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగే వన్డే సిరీస్ లో ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ఆడుతున్నారు. అయితే ఈ టోర్నమెంట్ పూర్తయిన తర్వాత, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భవిష్యత్తు ఏంటి అనే దానిపైన బీసీసీఐ తెలుసుకోవాలని అనుకుంటుందట. రిటైర్మెంట్ ఇస్తారా ? లేక వన్డేల్లో అలాగే కొనసాగుతారా అనే దానిపైన వాళ్ళ నుంచి ఆన్సర్ రాబట్టేందుకు అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేయబోతుందట. దీంతో ఫాన్స్ అందరు టెన్షన్ పడుతున్నారు.

Also Read: WPL 2026 auction: WPL మెగా వేలంలో హీలీ Un sold.. దీప్తికి రూ.3.2 కోట్లు.. కడప బిడ్డకు భారీ ధర.. పూర్తి డీటెయిల్స్ ఇవే

రోహిత్‌-కోహ్లీతో బీసీసీఐ అత్య‌వ‌స‌ర మీటింగ్‌

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. మొట్ట మొదటి వన్డే మ్యాచ్, జార్ఖండ్ లోని రాంచీ వేదికగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇతర టీమ్ ఇండియా ప్లేయర్ లందరూ రాంచీకి చేరుకున్నారు. మొదట ధోని ఇచ్చిన డిన్నర్ పార్టీలో పాల్గొన్న టీమిండియా ఆటగాళ్లందరూ, ప్రాక్టీస్ లో నిమగ్నమైపోయారు.

ఇలాంటి నేపథ్యంలో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీకి ఊహించని షాక్ తగిలింది. వాళ్ళిద్దరితో ఇవాళ భారత క్రికెట్ నియంత్రణ మండలి పెద్దలు అత్యవసర సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా వాళ్ళ రిటైర్మెంట్ పై అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు. 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతారా ? ఆలోపే రిటైర్మెంట్ ప్రకటిస్తారా ? అనే ప్రశ్నలను ఈ ఇద్దరు క్రికెట్లను అడగనున్నారట బీసీసీఐ పెద్దలు. వాళ్లు చెప్పే ఆన్సర్లను బట్టి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రిటైర్మెంట్ ఇప్పుడే తీసుకోబోమంటే, వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్లో వాళ్లకు ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అత్యవసర సమావేశం అని ఈ ప్రకటన రాగానే రోకో అభిమానులకు కొత్త టెన్షన్ మొదలైంది.

 

గంభీర్, అజిత్ అగార్కర్ పై వేటు వేయండి

టీమిండియా వరుసగా సిరీస్ లు కోల్పోతున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ పై వేటువేయాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరిని తొలగిస్తేనే, టీమిండియా గాడిలో పడుతుందని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వాళ్ళిద్దరిపై వేటువేయాల్సింది పోగా, రోకో కాంబినేషన్ తో అత్యవసర మీటింగ్ ఎందుకని నిలదీస్తున్నారో ఫ్యాన్స్. రోకో విషయం పక్కకు పెట్టి , గిల్, అజిత్ అగార్కర్ అలాగే గౌతమ్ గంభీర్ పై వేటువేయాలని అంటున్నారు.

Also Read: IND VS SA ODI Series: ద‌క్షిణాఫ్రికా-టీమిండియా 3 వ‌న్డేల సిరీస్..టైమింగ్స్‌, షెడ్యూల్, ఉచితంగా ఎలా చూడాలంటే

 

Related News

Shreyas Iyer: వివాదంలో శ్రేయస్ అయ్య‌ర్‌…అంపైర్ పై దాడికి య‌త్నం !

బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి !

Pakistan : పాకిస్తాన్ కోచ్ గా వీరేంద్ర సెహ్వాగ్ ? PCB షాకింగ్ నిర్ణ‌యం

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

Big Stories

×