IND VS SA: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య గౌహతి వేదికగా రెండో టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ నేపథ్యంలో అద్భుతంగా రాణించిన దక్షిణాఫ్రికా టీమిండియా ముందు 500 కు పైగా పరుగుల టార్గెట్ ఉంచింది. రెండో ఇన్నింగ్స్ లో 260 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా, 548 పరుగుల లీడ్ సంపాదించింది. అంటే 549 పరుగులు పరుగులు చేస్తే టీమిండియా విజయం సాధిస్తుందన్నమాట. ఈ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 489 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టీమిండియా మొదటి ఇన్నింగ్స్ లో 201 పరుగులకే కుప్పకూలింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతోంది టీమిండియా.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకుంటుంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ వ్యవహరించిన తీరుగానే గ్రాఫిక్స్ చేయాలని బొక్క బోర్లా పడుతోంది బీసీసీఐ. బుమ్ర బౌలింగ్ వేస్తున్న సమయంలో అతని బౌలింగ్ మూమెంట్ ను గ్రాఫిక్స్ ద్వారా చూపించాలని భావించింది బీసీసీఐ. అయితే దీని కోసం పిచ్చి గీతలు గీసి, అతని బౌలింగ్ యాక్షన్ చూపించే ప్రయత్నం చేసింది. వాస్తవంగా బౌలింగ్ యాక్షన్ చూపించడంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మొదటి స్థానంలో ఉంటుంది. నూతన టెక్నాలజీ వాడి, కంప్యూటర్ గీతలతో బౌలర్ల యాక్షన్ చూపిస్తోంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. మొన్నటి వరకు టీమిండియా, ఆసీస్ గడ్డపై ఆడినప్పుడు ఈ విషయం బయటపడింది. కానీ రూ.1867 కోట్ల ఆదాయం ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం, పిచ్చి గీతలతో గ్రాఫిక్స్ చేసింది. పైన పేర్కొన్న ఫోటోలో ఈ విషయం మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో బీసీసీఐపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు. ఎన్ని కోట్ల ఆదాయం ఉన్న దండగే అంటున్నారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి పరువు మొత్తం పోయిందని విమర్శలు చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు జరుగుతున్న నేపథ్యంలో సఫారీలు అద్భుతంగా రాణించారు. అయితే వాళ్ల వికెట్లను పడగొట్టేందుకు టీమిండియా చాలా కష్టపడింది. ఈ సందర్భంగా బాల్ కు మంచి గ్రిప్ దొరకాలి అన్న ప్లాన్ లో భాగంగా సిరాజ్ ఓ పని చేశాడు. కుల్దీప్ యాదవ్ వద్దకు వెళ్లి తన తలకు ఉన్న చెమటను బంతికి రాశాడు. ఆ తర్వాత బౌలింగ్ చేయమన్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లు కూడా గతంలో ఇలాగే గుండుకు బంతులు రాసి బౌలింగ్ చేసేవారు. గుండుకు ఉన్న చెమట కారణంగా, బంతి బౌలర్ చెప్పినట్లు పడేది. సిరాజ్ కూడా తాజాగా అలాగే చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!
BCCI hired a kindergarten student?
Top level embarrassing 😹 pic.twitter.com/q3D8j93IXe— Dinda Academy (@academy_dinda) November 25, 2025