BigTV English

Bengaluru Stampede: విరాట్ కోహ్లీ పై కేసు… రంగంలోకి CID… అరెస్టు తప్పదా!

Bengaluru Stampede: విరాట్ కోహ్లీ పై కేసు… రంగంలోకి CID… అరెస్టు తప్పదా!

Bengaluru Stampede: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {IPL} 2025 18వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {RCB} జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆర్సిబి ఐపిఎల్ టీం విజయోత్సవ ర్యాలీ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జూన్ 4వ తేదీన జరిగిన తొక్కేసలాట ఘటనలో 11 మంది దుర్మరణం పాలయ్యారు.


Also Read: Suresh Raina Love Story: టోర్నమెంట్ మధ్యలోనే ఎస్కేప్ అయి.. పెళ్లి చేసుకున్న టీమిండియా క్రికెటర్..బీసీసీఐ యాక్షన్!

మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు పై కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీంతో ఆర్సిబి, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ {KCA} సహా తొక్కిసలాటతో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.


రంగంలోకి CID:

ఇక ఈ ఘటనను బీసీసీఐ కూడా సీరియస్ గా తీసుకుంది. మరోవైపు ఈ కేసును సిఐడీకి బదిలీ చేసింది కర్ణాటక ప్రభుత్వం. సిఐడి ఎస్పి శోభన్విత నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుంది. అలాగే రిటైర్డ్ న్యాయమూర్తి మైకేల్ డి కున్హ నేతృత్వంలో న్యాయ విచారణకు సైతం ఆదేశించారు. అయితే ఈ తొక్కీసలాట ఆకస్మికంగా జరిగిందా..? లేక ఇతరత్రా సంఘాలు, సంస్థల ప్రమేయం ఉందా..? అనే కోణంలో విచారించారు.

అయితే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ శంకర్, కోశాధికారి ఈఎస్ జయరాం తమ పదవులకు రాజీనామా చేశారు. ఆర్సీబీ విజయోత్సవ వేడుకకు అనుమతి కోరుతూ కబ్బన్ పోలీసులకు మూడవ తేదీ రాత్రి సాయంత్రం 6 గంటలకు ఆర్సిబి వినతి పత్రం ఇచ్చింది. ఇందులో చిన్నస్వామీ స్టేడియంలో కార్యక్రమం నిర్వహిస్తారని పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీ అరెస్టు తప్పదా!

అయితే ఇప్పుడు సిఐడి విచారణలో పలు కీలక విషయాలు బయటకు వచ్చినట్లు సమాచారం. ఆర్సిబి స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన భార్య పిల్లలతో కలిసి త్వరలో లండన్ లో స్థిరపడతారని, రిటైర్మెంట్ తర్వాత తన మిగిలిన జీవితాన్ని లండన్ లో గడపాలనుకుంటున్నాడట. గత కొన్నేళ్లుగా కోహ్లీ తరచూ లండన్ పర్యటనకు వెళ్లడం దీనికి బలం చేకూరుస్తుంది.

Also Read: Abdul Kalam on Dhoni: ధోనిపై అబ్దుల్ కలాంకు ఇంత నమ్మకమా… వాడు ఒక్కడుంటే చాలు అంటూ

ప్రస్తుతం కూడా విరాట్ కోహ్లీ లండన్ లోనే ఉన్నాడు. అయితే సిఐడి రిపోర్ట్ లో.. కోహ్లీ త్వరగా లండన్ వెళ్లిపోతాడని, అందుకే బెంగుళూరు యాజమాన్యం {RCB management } విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించిందట. పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి మరి పర్మిషన్స్ తీసుకున్నారట. దీనంతటికీ కోహ్లీ లండన్ వెళ్లడమే కారణం అని ఓ వార్త వైరల్ గా మారింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ పై కేసు పెట్టే అవకాశం కూడా ఉందని సమాచారం.

Related News

Neymar Junior : రూ.10వేల కోట్ల ఆస్తి.. ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చేసిన బిలియనీర్‌

Ross Taylor : రాస్ టేలర్ తో రెండు దేశాల తరఫున ఆడిన క్రికెటర్లు వీళ్లే… లిస్టు పెద్దదే

Timed Out In KCL 2025 : గ్రౌండ్ లో అడుగుపెట్టకుండానే ఔట్ అయిన బ్యాట్స్మెన్… అప్పట్లో KCL లో అరుదైన సంఘటన.. మాథ్యూస్ తరహాలోనే

Shreyas Iyer – BCCI: శ్రేయాస్ అయ్య‌ర్ కు అదిరిపోయే ఆఫ‌ర్‌..బీసీసీఐ ప్లాన్ అదుర్స్‌.. ఇక ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లే

Asia Cup 2025: దుబాయ్ లో అడుగుపెట్టిన టీమిండియా…జెర్సీలో ఈ మార్పు గ‌మ‌నించారా

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Big Stories

×