E-Paper
Advertisement

Colombo Rains: గ‌బ్బులేపుతున్న కొలంబో వ‌ర్షాలు…వ‌ర‌ల్డ్ క‌ప్ లో 4 మ్యాచ్ లు ర‌ద్దు..త‌ల ప‌ట్టుకుంటున్న ఐసీసీ

Colombo Rains: గ‌బ్బులేపుతున్న కొలంబో వ‌ర్షాలు…వ‌ర‌ల్డ్ క‌ప్ లో 4 మ్యాచ్ లు ర‌ద్దు..త‌ల ప‌ట్టుకుంటున్న ఐసీసీ
Advertisement

Colombo Rains: వన్డే మహిళల వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో కొలంబోలోని ప్రేమదాస స్టేడియం ఐసీసీకి తలనొప్పులు తీసుకువస్తోంది. కొలంబోలో వ‌రుస‌గా వ‌ర్షాలు ప‌డుతున్న నేప‌థ్యంలో మ్యాచ్ ల‌కు తీవ్ర అంత‌రాయం కలుగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు ఆడిన 4 వరల్డ్ కప్ మ్యాచ్ లు కూడా వర్షం కారణంగా రద్దు అయ్యాయి. దీంతో గెలవాల్సిన జట్లు ఒక్క పాయింట్ తో సరిపెట్టుకోవడం జరిగింది. ఈ ఎఫెక్ట్ సెమీ ఫైనల్ కు వెళ్లే జట్లపైన కూడా పడుతోంది. పాయింట్ల పట్టిక కూడా తలకిందులు అవుతోంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ లు కూడా రద్దయ్యాయి. ఇండియాలో పాకిస్తాన్ పర్యటించే అవకాశం లేనందున, ప్రతి మ్యాచ్ కొలంబో వేదికగా పాకిస్తాన్ ఆడుతోంది. ఇలాంటి నేపథ్యంలో.. పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచ్ లు కూడా వర్షం కారణంగా రద్దయ్యాయి. దీంతో రెండు పాయింట్లు పాకిస్తాన్ దక్కించుకొని స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది.

Also Read: LSG – Kane Williamson: సంజీవ్ గోయెంకా తెలివి త‌క్కువ నిర్ణ‌యం…అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కేన్ మామ కోసం పాకులాట ?

వ‌ర‌ల్డ్ క‌ప్ లో 4 మ్యాచ్ లు ర‌ద్దు

Advertisement

కొలంబో వేదికగా జరిగిన నాలుగు వరల్డ్ కప్ మ్యాచ్లు ఇప్పటివరకు రద్దయ్యాయి. మొదట శ్రీలంక వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ప్రేమదాస స్టేడియం వేదికగానే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగితే ఆ మ్యాచ్ కూడా రద్దయింది. ఇక పాకిస్తాన్ జట్టుతో ఇంగ్లాండ్ అటు న్యూజిలాండ్ రెండు జట్లు తలపడితే ఆ రెండు మ్యాచ్ లు కూడా రద్దయ్యాయి.

కేవలం ప్రేమ దాస స్టేడియం వేదికగానే మ్యాచ్ లు నిర్వహించడం, అక్కడే భారీ వర్షాలు కురవడం ఐసీసీకి తలనొప్పులు తీసుకువస్తుంది. వేదికలు ఎక్కువగా పెట్టుకుంటే బాగుండు కదా అని ఇప్పుడు క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఇలా ఐసీసీ టోర్నమెంట్లలో నాలుగు మ్యాచ్ లు రద్దు కావడం దారుణమని మండిపడుతున్నారు. ఇప్పటికైనా కొలంబో వేదికను మార్చాలని కోరుతున్నారు. సరిగ్గా వర్షాకాలంలో ఇలాంటి ఈవెంట్లను నిర్వహించకూడదని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి గబ్బు లేపుతున్న కొలంబో వేదిక.. ఐసీసీకి తలనొప్పులు తీసుకువస్తోంది.

సెమీ ఫైనల్ కు వెళ్లిన ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా

Advertisement

వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ఇప్పటి వరకు రెండు జట్లు సెమీ ఫైనల్ కు దూసుకువెళ్లాయి. 9 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా అలాగే 8 పాయింట్ల‌తో దక్షిణాఫ్రికా రెండు కూడా సెమీ ఫైనల్ కు వెళ్లాయి. మరో రెండు జట్లు సెమీ ఫైనల్ కు వెళ్లాల్సి ఉంది. ఇంగ్లాండ్, టీమిండియా అలాగే న్యూజిలాండ్ జ‌ట్లకు సెమీ ఫైనల్ వెళ్లే అవకాశం ఉంది. కానీ దాదాపుగా ఇంగ్లాండ్ తో పాటు టీమిండియా ఫైనల్ కు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

Also Read: Commonwealth Games 2030 : 2030 కామన్‌ వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..అసలు వీటికి ఆ పేరు ఎలా వ‌చ్చింది

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×