E-Paper
Advertisement

Womens World Cup 2025: పాక్ కొంప‌ముంచిన వ‌ర్షం..ద‌క్షిణాఫ్రికా క్వాలిఫై, టీమిండియా సెమీస్ కు వెళ్లే మార్గాలు ఇవే

Womens World Cup 2025: పాక్ కొంప‌ముంచిన వ‌ర్షం..ద‌క్షిణాఫ్రికా క్వాలిఫై, టీమిండియా సెమీస్ కు వెళ్లే మార్గాలు ఇవే

Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 19 మ్యాచ్ లు ఈ టోర్నమెంట్ లో పూర్తయ్యాయి. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇలాంటి నేపథ్యంలో రెండు జట్లకు తలో పాయింట్ అందించింది ఐసీసీ. ఈ దెబ్బకు పాయింట్లు పట్టికలో నెంబర్ 2 స్థానంలో ఉన్న సౌతాఫ్రికా సెమీస్‌ క్వాలిఫై అయింది. అదే సమయంలో నాలుగో స్థానంలో ఉన్న టీమిండియాకు కాస్త ఊరట లభించింది. ఇవాల్టి మ్యాచ్ లో న్యూజిలాండ్ కనుక గెలిస్తే, టీమిండియా సెమీస్ ఆశలు దాదాపు గల్లంతు అయ్యేవి. కానీ వర్షం కారణంగా ఇండియాకు లాభం చేకూరింది.

Also Read: Commonwealth Games 2030 : 2030 కామన్‌ వెల్త్ గేమ్స్‌కు భారత్ ఆతిథ్యం..అసలు వీటికి ఆ పేరు ఎలా వ‌చ్చింది

సెమీస్ కు దూసుకు వెళ్లిన దక్షిణాఫ్రికా

ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో సెమీస్ కు దూసుకు వెళ్ళింది దక్షిణాఫ్రికా. ఇప్పటికే ఆస్ట్రేలియా మహిళల జట్టు 9 పాయింట్లతో మొదట సెమీస్ కు వెళ్ళింది. ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మహిళల జ‌ట్ల మధ్య వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో.. పాయింట్ల ప్రకారం నేరుగా సెమీస్ కు దక్షిణాఫ్రికా దూసుకువెళ్లింది. ఇక మరో రెండు జట్లు సెమీస్ కోసం తలపడుతున్నాయి. ఇంగ్లాండ్, టీమిండియా, న్యూజిలాండ్ జట్లకు సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

సెమీ ఫైనల్ కు టీమిండియా వెళ్లాలంటే ఎలా?

వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో టీమిండియా సెమీ ఫైనల్ కు వెళ్లాలంటే కచ్చితంగా మూడు మ్యాచ్ లు వరుసగా గెలవాల్సిందే. టీమిండియా తన తర్వాతి మ్యాచ్ ల‌లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జ‌ట్ల‌తో తలపడనుంది. రేపు ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఉంది. ఈ మూడు మ్యాచ్ ల‌లో కూడా టీమిండియా గెలిస్తే ఎలాంటి డౌట్ లేకుండా సెమీ ఫైనల్ కు వెళుతుంది. అయితే ఈ మూడు మ్యాచ్ ల‌లో ఒక్కటి ఓడి, రెండు గెలిచినా కూడా సెమీ ఫైనల్ కు వెళ్లే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా వెళ్లాలంటే, న్యూజిలాండ్ వరుసగా అన్ని మ్యాచ్ లు ఓడిపోవాలి. అదే జరిగితే రన్ రేట్ ప్రకారం టీమిండియా నేరుగా సెమీ ఫైనల్ కు వెళుతుంది. అటు సెమీ ఫైనల్ కు ఇంగ్లాండ్ కూడా వెళ్తుంది. ఇది ఇలా ఉండ‌గా, ఇక ఈ టోర్న‌మెంట్ లో ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్ లు కూడా వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు అయ్యాయి. దీని వ‌ల్ల పాకిస్థాన్ కు ఒక్కో పాయింట్ తో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఈ త‌రుణంలోనే ఇంటికి వెళ్లాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

Also Read: LSG – Kane Williamson: సంజీవ్ గోయెంకా తెలివి త‌క్కువ నిర్ణ‌యం…అన్ సోల్డ్ ప్లేయ‌ర్ కేన్ మామ కోసం పాకులాట ?

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×