E-Paper
Advertisement

MS Dhoni-Chandrababu: ఏపీలో ధోని ప‌ర్య‌ట‌న‌..చంద్ర‌బాబుతో స‌మావేశం..అస‌లు కార‌ణం ఇదే !

MS Dhoni-Chandrababu: ఏపీలో ధోని ప‌ర్య‌ట‌న‌..చంద్ర‌బాబుతో స‌మావేశం..అస‌లు కార‌ణం ఇదే !
Advertisement

MS Dhoni-Chandrababu:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ( Ms Dhoni) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh) రాష్ట్రంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో కూడా సమావేశం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు మహేంద్ర సింగ్ ధోని ఏపీ పర్యటన ఖరారు అయింది. జనవరి 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పర్యటిస్తారని తెలుస్తోంది. దాదాపు రెండు రోజులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోనే మహేంద్ర సింగ్ ధోని గడుపుతారని కూడా సమాచారం అందుతోంది.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

అమరావతిలో మహేంద్రసింగ్ ధోని పర్యటన

Advertisement

ఏపీ పర్యటనలో భాగంగా మహేంద్ర సింగ్ ధోని అమరావతిలో కూడా పలు ప్రాంతాలను సందర్శిస్తారట. జనవరి 9వ తేదీన మధ్యాహ్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ( Cm Chandrababu naidu) కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తారని లీకులు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ జరగనుందట. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధిపై మహేందర్ సింగ్ ధోనితో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చిస్తారని తెలుస్తోంది. ఏపీలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేసే విషయం పైన ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య చర్చ జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్రసింగ్ ధోని

ఇక ఏపీ బ్రాండ్ అంబాసిడర్ గా మహేంద్రసింగ్ ధోని నియామకం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు కూడా తెలుస్తోంది. ఏపీలోని చేనేత రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా బ్రాండ్ అంబాసిడర్ గా ధోనిని నియామకం చేయాలని.. ఈ మేరకు అతని అనుమతి తీసుకోవాలని చంద్రబాబు సర్కార్ ఆలోచన చేస్తుంది అంట. జనవరి 9వ తేదీన జరిగే సమావేశంలో ధోనితో ఇదే అంశంపై చంద్రబాబు నాయుడు చర్చిస్తారని తెలుస్తోంది. ఈ సమావేశం అనంతరం అమరావతిలోని పలు పర్యాటక క్షేత్రాల్లో కూడా మహేంద్రసింగ్ ధోని పర్యటన ఉంటుందట. ఇలా రెండు రోజులపాటు ఏపీలోనే ధోని ఉంటాడని చెబుతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏపీ ప్రభుత్వం రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అటు మహేంద్రసింగ్ ధోని ఏపీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అలర్ట్ గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించబోతున్న మహేంద్రసింగ్ ధోని… త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో కూడా ఆడ బోతున్నాడు. గత సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించిన మహేంద్ర సింగ్ ధోని.. ఈసారి ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగనున్నాడు.

Advertisement

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

 

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×