IND VS PAK: టీ20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 Tournament) నేపథ్యంలో ఆదివారం టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Women vs Pakistan Women) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన టీమిండియా 64 పరుగులు తేడాతో విక్టరీ అందుకుంది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో అదరగొట్టిన టీమిండియా…టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో మంచి శుభారంభం అందుకుంది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా బౌలర్ దీప్తి శర్మ (Deepti Sharma).. జేబులో అనుమానాస్పదంగా ఓ స్ప్రే బాటిల్ దర్శనమిచ్చింది. ఈ స్ప్రే బాటిల్ తో పాకిస్తాన్ ప్లేయర్లపై ఎటాక్ చేసేందుకు దీప్తి శర్మ ప్రయత్నించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆమె ఫోటోలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( Team India Women vs Pakistan Women) మ్యాచ్ జరగగా.. దీప్తి శర్మ (Deepti Sharma) వివాదంలో చిక్కుకున్నారు. మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత జేబులో స్ప్రే బాటిల్ తీసుకొని.. గ్రౌండ్ లోకి వచ్చారు. తన జేబులో ఆ స్ప్రే బాటిల్ పట్టుకొని.. అనుమానస్పదంగా వ్యవహరించారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో దీప్తి శర్మపై సంచలన ఆరోపణలు చేస్తోంది పాకిస్తాన్. పాకిస్తాన్ ప్లేయర్లను చంపేసేందుకు దీప్తి శర్మ కుట్రలకు తెరలేపిందని… అందుకే జేబులో స్ప్రే బాటిల్ తీసుకువచ్చిందని దారుణంగా పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్ అంటే పగ పెంచుకున్న ఆమె.. మైదానంలో దాడి చేసేందుకు ప్రయత్నించిందని ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు దారుణంగా పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిపై ఇండియన్ ఫ్యాన్స్ కూడా కౌంటర్ ఇస్తున్నారు. గతంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా… మైదానంలో స్ప్రే కొట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారని ఇండియన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా దోమలను కొట్టేందుకు మాత్రమే దీప్తి శర్మ స్ప్రే తీసుకువచ్చిందని… పాకిస్తాన్ వాళ్ల కోసం కాదంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
ఆదివారం జరిగిన పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ నేపథ్యంలో దీప్తి శర్మ అదరగొట్టారు. నాలుగు ఓవర్లు వేసిన దీప్తి శర్మ.. పది పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశారు. ఈ క్రమంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా ఆమె సొంతం చేసుకున్నారు.