E-Paper
Advertisement

WTC Final : ఆసక్తిగా చివరి రోజు ఆట.. కోహ్లి, రహానే నిలబడతారా..?

WTC Final :  ఆసక్తిగా చివరి రోజు ఆట.. కోహ్లి, రహానే నిలబడతారా..?
Advertisement

WTC Final : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ సమరం ఉత్కంఠభరిత ముగింపునకు చేరుకుంది. ఐదో రోజు ఆట ఆసక్తికరంగా మారింది. సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న భారత్.. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. టీమిండియా గెలవాలంటే.. చివరి రోజు 280 పరుగులు చేయాల్సి ఉంది. అదే 7 వికెట్లు పడగొడితే.. ఆస్ట్రేలియాదే విజయం. దీంతో ఐదో రోజు ఆట రసవత్తరంగా మారింది. విరాట్ కోహ్లి 44 పరుగులతో, అజింక్య రహానే 20 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Advertisement

రోహిత్ శర్మ 43 పరుగులు చేయగా.. గిల్ 18 పరుగులు, పుజారా 27 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యారు. ఆరంభంలో భారత్ అదరగొట్టినా.. వంద లోపు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయేసరికి.. ఆచితూచి ఆడాల్సిన అవసరం ఏర్పడింది. నాలుగో రోజు ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ లో.. 8 వికెట్ల నష్టానికి 270 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఆసీస్ వేగంగా స్కోర్ చేయలేకపోయింది.

రవీంద్ర జడేజా 3 వికెట్లు, ఉమేష్, షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక వికెట్ తీసుకున్నాడు. దీంతో 8 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. భారత్ కు 444 పరుగుల భారీ లక్ష్యం ఇచ్చి సెకండ్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. -అయితే విజయం అయినా దక్కాలి.. లేకపోతే మ్యాచ్ ను కనీసం డ్రాగానైనా ముగించాలి. దీంతో ఇవాళ టీమిండియా ఆటతీరు ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది.

Advertisement

క్రీజులో ఇంకా కోహ్లి, రహానే ఉండటం..అలాగే జడేజా, శార్దూల్ ఠాకూర్ బ్యాటతో రాణించగల సత్తా ఉన్నవారే. మొదట్లో వికెట్లు కాపాడుకుంటే భారత్ విజయాన్ని అందుకునే అవకాశాలుంటాయి. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా.. మ్యాచ్ వారి చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని.. విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కోహ్లి, రహానే నిలబడతారా..? ఆసీస్ బౌలర్లను అడ్డుకుంటారా..? గద దక్కేదెవరికో? మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.

Tags

Related News

2017లో విరాట్ కోహ్లీని చూసి ప్యాంట్ త‌డుపుకున్నా..అమీర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వాహాబ్ రియాజ్…మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

పాకిస్తాన్ ప‌త‌నానికి ఆకిబ్ జావేదే కార‌ణం..ఆ 7 గురు క్రికెట‌ర్ల జీవితాల‌తో ఆడుకుంటున్నాడు

PSL ర‌ద్దు అయ్యేలా బీసీసీఐ కుట్ర‌లు…విదేశీ క్రికెట‌ర్లను టార్చ‌ర్ చేసి మ‌రీ

పాకిస్తాన్ లో ప‌ర్య‌టించనున్న టీమిండియా..మోడీ స‌ర్కార్ గ్రీన్ సిగ్నల్ ?

నా ముందు గిల్ క్రిస్ట్, హేడెన్, ఏబీ డివిలియర్స్ పిల్ల బ‌చ్చాగాళ్లు

కోహ్లీ దుర్మార్గుడు..అంబ‌టి, యువ‌రాజ్ సింగ్ ల‌ కెరీర్ నాశ‌నం చేశాడు

Big Stories

Advertisement
×