BigTV English
Advertisement

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మొదటి మ్యాచ్ లోనే ఫైన్ ?

Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మొదటి మ్యాచ్ లోనే ఫైన్ ?

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ కష్టాలు తీరట్లేదు. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమిని చవిచూసింది. శనివారం రోజు అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడింది. దీంతో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలోనూ ఘోరంగా ఓటమిని చవిచూసి.. పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి దిగజారింది.


 

రెండవ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి కేవలం 160 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 36 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది ఎమ్ఐ. ఈ ఓటమితో కలత చెందిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తమ జట్టు చాలా తప్పులు చేసిందని అంగీకరించాడు.


” బౌలింగ్ లో మేము దాదాపు 20 పరుగులు అదనంగా ఇచ్చాము. బ్యాటింగ్ లోను దాదాపు 20 పరుగులు తక్కువగా వచ్చాయి అనుకుంటున్నాను. ఫీల్డింగ్ లో కూడా ప్రొఫెషనల్ గా లేము. మేము ప్రాథమికంగా తప్పులు చేశాం. మరోవైపు గుజరాత్ ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బౌలర్లు కూడా పెద్దగా అవకాశాలు ఇవ్వలేదు. మా జట్టులో అందరూ బాధ్యత తీసుకోవాలి. ప్రస్తుతం ఐపీఎల్ ప్రారంభ దశలోనే ఉన్నాం.

రాబోయే మ్యాచ్ లలో రాణిస్తారని ఆశిస్తున్నా”. అని చెప్పుకొచ్చాడు. అయితే 2024 సీజన్ లో స్లో ఓవర్ రేటు కారణంగా.. 2025 ఐపీఎల్ లోని మొదటి మ్యాచ్ కి కెప్టెన్ హార్దిక్ పాండ్యా పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్ లో రెండవ మ్యాచ్ కి అందుబాటులోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకి మరో షాక్ తగిలింది. శనివారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కు జరిమానా విధించారు.

హార్దిక్ పాండ్యా పై 12 లక్షల రూపాయల జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్యా ఈ ఫైన్ కి బాధ్యుడయ్యాడు. ఈ సీజన్ ఆరంభంలోనే స్లో ఓవర్ రేట్ రన్ చేశాడంటే.. ఇక ముందు జరిగే మ్యాచ్లలో ఎలా మైంటైన్ చేస్తాడో వేచి చూడాలి. ఈ సీజన్ లో స్లో ఓవర్ రేటు కారణంగా జరిమానాకు గురైన మొదటి కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.

 

అయితే గుజరాత్ టైటాన్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో జట్టు నిర్ణీత సమయంలో 20 ఓవర్లు వేయలేకపోయింది. దీని కారణంగా గుజరాత్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో వారికి జరిమానా విధించారు. ఆ ఓవర్ లో వారు 30 యార్డ్ సర్కిల్ లో ఒక ఫీల్డర్ ని అదనంగా ఉంచాల్సి వచ్చింది. కానీ ఈసారి స్లో ఓవర్ రేట్ కారణంగా ఐపీఎల్ లో ఏ కెప్టెన్ ని నిషేధించరు. ఈసారి ఐపీఎల్ లో ఐసీసీ తరహా డీమెరిట్ పాయింట్స్ సిస్టం ని ప్రవేశపెట్టారు.

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..వాష్టింగ‌న్ మ్యాజిక్‌..టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×