E-Paper
Advertisement

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్
Advertisement

Malayalam Suspense Thriller: ఒక మర్డర్ కేసు కేరళలో కలకలం రేపుతుంది. ఆ కేసు మిస్టరీ వీడకముందే ఏకంగా 26 మంది చిన్న పిల్లలు అదృశ్యమైతే ? వాళ్లను వెతికే బాధ్యత పోలీసులదే అనుకుంటాం. కానీ ఇక్కడ రంగంలోకి దిగేది పోలీసులే కాదు… సమాజంలో క్రిమినల్స్‌ గా ముద్రపడిన ఇద్దరు వ్యక్తులు. అసలు వాళ్లకు ఆ పిల్లల్లో ఒకరితో ఉన్న సంబంధం ఏంటి ? ఈ వెతుకులాట చివరకు ఎలాంటి షాకింగ్ నిజాలను బయట పెట్టింది ? అదే ‘పగిడ కాళి’ (Pagida Kali) సినిమా కథ. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడవచ్చు ? ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది ? అన్నది తెలియాలంటే సినిమా వివరాలపై ఒక లుక్కేయాల్సిందే.

కథలోకి వెళ్తే…

కేరళలో ఓ మిస్టరీ మర్డర్ స్థానికంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. పోలీసులు ఆ కేసును ఛేదించే ప్రయత్నాల్లో ఉండగానే పరిస్థితులు మరింత విషమిస్తాయి. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఏకంగా 26 మంది చిన్న పిల్లలు కనిపించకుండా పోతారు. ఒక్కసారిగా ఇంతమంది పిల్లలు అదృశ్యం కావడంతో పోలీస్ శాఖపై ఒత్తిడి పెరుగుతుంది. అసలు ఈ కిడ్నాప్‌ల వెనుక ఎవరు ఉన్నారు ? పిల్లలను ఎక్కడికి తీసుకెళ్లారు ? అనే ప్రశ్నలు జనాలను ఆందోళనలో పడేస్తాయి.

Advertisement

ఇదే సమయంలో కథలోకి ఇద్దరు క్రిమినల్స్ వస్తారు. టిటో విల్సన్, దేవసూర్య పోషించిన ఈ ఇద్దరి పాత్రలకు నేర చరిత్ర ఉంటుంది. సాధారణంగా చట్టానికి దూరంగా ఉండే వీళ్లే ఇప్పుడు అదృశ్యమైన పిల్లల కోసం వెతకడం మొదలు పెడతారు. అయితే వాళ్ల లక్ష్యం మొత్తం 26 మంది పిల్లలు కాదు. ఆ పిల్లల్లో ఒక చిన్నారి కోసం వీళ్లు ప్రాణాలకు తెగించి రంగంలోకి దిగుతారు. మొదట వ్యక్తిగత కారణంతో మొదలైన ఈ వెతుకులాట క్రమంగా ఊహించని మలుపులు తిరుగుతుంది. పిల్లల అదృశ్యానికి సంబంధించిన ఆధారాలు కేరళ దాటి ఇతర ప్రాంతాలకు కూడా తీసుకెళ్తాయి.

దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఇది సాధారణ కిడ్నాప్ వ్యవహారం కాదని అర్థమవుతుంది. దీని వెనుక భారీ అంతర్రాష్ట్ర నేర నెట్‌వర్క్ ఉందని తెలుస్తుంది. అంతేకాదు… ఈ క్రిమినల్స్‌కు దొరికే ఆధారాలు ఒక పెద్ద రాజకీయ కుట్ర వైపు చూపిస్తాయి. పోలీసులు ఛేదించాల్సిన కేసులోకి ఈ ఇద్దరు ఎందుకు వచ్చారు ? 26 మంది పిల్లలను కిడ్నాప్ చేసింది ఎవరు ? వాళ్లలో ఆ ఒక్క చిన్నారి ఎందుకు అంత కీలకం ? చివరకు ఈ నేరాల వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు ? అనే ప్రశ్నలకు సినిమా ఉత్కంఠభరితంగా సమాధానం చెబుతుంది.

ఐఫోన్‌తోనే షూటింగ్… ఓటీటీలో మలయాళంలో

Advertisement

‘పగిడ కాళి’ చిత్రానికి నిషాద్ హసన్ దర్శకత్వం వహించారు. క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా మరో ప్రత్యేకత కూడా ఉంది. సినిమాను పూర్తిగా ఐఫోన్ తో చిత్రీకరించారు. దీంతో టెక్నికల్‌గా కూడా ఈ మూవీ ఆసక్తిని కలిగిస్తుంది. ఈ చిత్రం ప్రస్తుతం ‘మనోరమా మ్యాక్స్’ (ManoramaMAX)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగులో ఆడియో అందుబాటులో లేదు. ఒరిజినల్ మలయాళ భాషలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడాల్సి ఉంటుంది. క్రైమ్ మిస్టరీ, కిడ్నాప్ ఇన్వెస్టిగేషన్, పొలిటికల్ కాన్స్పిరసీ కలిసిన థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ మూవీ మంచి వీకెండ్ వాచ్‌గా అనిపించొచ్చు.

Read Also: గేమింగ్ ప్రేమికులకు ఊహించని విజువల్ ట్రీట్… 8000 కోట్ల రోలర్‌కోస్టర్ రైడ్

Related News

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

నెత్తురు ఏరులై పారించే ఊరమాస్ రివేంజ్ డ్రామా… లోకేష్ కనగరాజ్ 100 కోట్ల యాక్షన్ థ్రిల్లర్ తెలుగులోనే స్ట్రీమింగ్

ఒంటరి మనుషులే టార్గెట్… సైకో వదిలిన క్లూస్‌తో ఊపిరి బిగపట్టే పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుగులో

Big Stories

Advertisement
×