E-Paper
Advertisement

BCCI : సెలెక్టర్లను ఎలా బీసీసీఐ ఎంచుకుటుంది.. ఉండాల్సిన అర్హతలు ఏంటి

BCCI :  సెలెక్టర్లను ఎలా బీసీసీఐ ఎంచుకుటుంది.. ఉండాల్సిన అర్హతలు ఏంటి

BCCI :   సాధారణంగా క్రికెట్ (Cricket) లో రకరకాల రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఆటగాళ్లను సెలెక్టర్ల కమిటీ ఎంపిక చేస్తుంది. అయితే ఏ ఆటగాడు ఎంపిక కావాలన్నా..? ఆ ఆటగాడు తమ ప్రతిభను కనబరచాలి. సెలక్షన్ కమిటీ వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని జట్టును ప్రకటిస్తుంది. ఇదంతా మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.కానీ ఆసియా కప్ కి టీమిండియా (Team india) కీలక బ్యాటర్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) , కీలక బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ని సెలెక్ట్ చేయకపోవడం పై సెలక్షన్ కమిటీ, బీసీసీఐ (BCCI) పై పలువురు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు సెలక్టర్లను బీసీసీఐ ఎలా నియమించుకుంటుంది. వారికి ఉండాల్సిన అర్హతలు ఏమిటి..? వారి యొక్క విధులు, బాధ్యతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సెలక్షన్ కమిటీ విధులు, బాధ్యతలు : 

  • తొలుత బీసీసీఐ (BCCI) నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని గడువు విధిస్తుంది. ఆ తరువాత వీరి రిక్రూట్ మెంట్ ప్రాసెస్ జరుగుతుంది.
  • న్యాయంగా, పారదర్శక పద్దతిలో అత్యుత్తమ జట్టును ఎంపిక చేయాలి.
  • సీనియర్ పురుషుల టీమ్ రిజర్వ్ బెంచ్ ను బలోపేతం చేయడం పై దృష్టి సారించాలి. దానికి తగ్గట్టు ప్రణాళికలు తయారు చేయాలి. 
  • అవసరమైన సందర్భంలో జట్టు సమావేశాలకు హాజరు కావాలి.
  • దేశీయ, అంతర్జాతీయ మ్యాచ్ లను గమనించేందుకు ప్రయాణాలు చేస్తూ ఉండాలి.
  • ఆటగాళ్ల, జట్టు ప్రదర్శన పై ప్రతీ మూడు నెలలకొకసారి నివేదికలు రూపొందించి బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ కు సమర్పించాలి.
  • జట్టు ఎంపిక పై బీసీసీఐ ఆదేశాల మేరకు మీడియాతో మాట్లాడాలి.
  • ప్రతీ ఫార్మాట్ కి సరైన నాయకుడిని నియమించాలి.
  • బీసీసీఐ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి.

సభ్యులకు ఉండాల్సిన అర్హతలు : 

  • సభ్యులకు కనీసం 7 టెస్ట్ మ్యాచ్ లు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడి ఉండాలి.
  • క్రికెట్ కి వీడ్కోలు పలికి దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తి కావాలి.
  • వీరిలో ఐదుగురు సభ్యులకు వయస్సు పరిమితి 60 సంవత్సరాల లోపు వారికే అవకాశం ఉంటుంది.
  • మొత్తం 5 సంవత్సరాల పాటు ఏదైనా క్రికెట్ కమిటీలో సభ్యుడిగా ఉన్న వ్యక్తి దరఖాస్తు చేసుకునేందుకు అనర్హుడు.

ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు ప్రకటన తీవ్ర వివాదాలకు దారితీసింది. శ్రేయాస్ అయ్యర్‌ను  మినహాయించడం పై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar)  తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. భారత మాజీ కెప్టెన్ , BCCI మాజీ సెలెక్టర్ క్రిస్ శ్రీకాంత్.. అగార్కర్‌ పై విమర్శలు గుప్పించారు. దేశంలో అత్యంత ఫామ్‌లో ఉన్న బ్యాటర్లలో ఒకరిని వదిలివేయడం వెనుక ఉన్న తర్కాన్ని ప్రశ్నించారు. IPL 2025లో పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహించిన అయ్యర్.. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో గైర్హాజరైన వారిలో ఒకరు. ముఖ్యంగా అతను ఐదుగురు సభ్యుల రిజర్వ్‌లలో కూడా  చేర్చబడకపోవడం గమనార్హం. అక్కడ ధ్రువ్ జురెల్‌ను మూడవ వికెట్ కీపర్‌గా ఎంచుకున్నారు. అయ్యర్‌ను జట్టులోకి తీసుకోవడంలో మరొకరిని తొలగించకుండా సవాల్ ఉందని పేర్కొంటూ అగార్కర్ తన పిలుపును సమర్థించుకున్నాడు.

?igsh=emV3NTNmbGFqMzNz

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×