E-Paper
Advertisement

Team India Victory Rally: టీమిండియా ప్లేయర్ల రోడ్ షో.. కిక్కిరిసిపోయిన ముంబై రహదారులు

Team India Victory Rally: టీమిండియా ప్లేయర్ల రోడ్ షో.. కిక్కిరిసిపోయిన ముంబై రహదారులు
Advertisement

Fans came in Large Numbers for Huge Victory Rally: 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ టీ20 వరల్డ్ కప్ -2024 సాధించి విజయ పతాకాన్ని ఎగురవేసిన టీమిండియా గురువారం స్వదేశానికి చేరుకుంది. ఉదయం ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆయనతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. ఆ తరువాత ముంబైకి బయలుదేరారు. ముంబైలోని మెరైన్ రోడ్డులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.

ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లు ఓపెన్ టాప్ బస్ లో నిల్చుని రోడ్ షోలో పాల్గొన్నారు. రెండు గంటలపాటు సాగిన ఈ ఊరేగింపు నారీమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు కొనసాగింది. టీమిండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకుని అభిమానులకు అభివాదం చేస్తూ మందుకుసాగారు. ఓపెన్ టాప్ బస్సులోంచి భారత ఆటగాళ్లు అభిమానులను ఉత్సాహపరిచారు. దీంతో తమ అభిమాన క్రికెటర్లను తమ ఫోన్లలో వీడియోలు, ఫొటోలు తీసుకునేందుకు పోటీ పడ్డారు.

Advertisement

విశ్వవిజేతలకు ఘన స్వాగతం పలికేందుకు క్రికెట్ అభిమానులు, ప్రజలు భారీగా ముంబైకి తరలివచ్చారు. మెరైన్ రోడ్డుకు మధ్యాహ్నం నుంచే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో ఆ రోడ్డు మొత్తం అభిమానులతో నిండిపోయింది. వాళ్లంతా మువ్వన్నెల జెండాలను ప్రదర్శిస్తూ తెగ సందడి చేశారు. రాత్రి వాంఖడే స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో భారత జట్టుకు సన్మాన కార్యక్రమం నిర్వహించి రూ. 125 కోట్ల నగదు బహుమతిని అందజేశారు. అయితే, షెడ్యూల్ ప్రకారం సాయంత్రం ఐదు గంటలకే రోడ్ షో ప్రారంభం కావాల్సి ఉండగా.. భారత ఆటగాళ్లు ఢిల్లీ నుంచి ముంబైకి ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో రోడ్ షో ఆలస్యంగా ప్రారంభమయ్యింది.

Also Read: నాడు విమర్శలు.. నేడు జేజేలు

Advertisement

అదేవిధంగా వాంఖడే స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి కూడా అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉచిత ప్రవేశం కల్పించడంతో స్టేడియంలో అన్ని స్టాండ్స్ కూడా అభిమానులతో కిటకిటలాడాయి. టీమిండియా క్రికెటర్లు బీసీసీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో బార్బడోస్ నుంచి ఢిల్లీకి వచ్చారు. అక్కడి నుంచి ముంబైకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, టీమిండియా ప్లేయర్స్ ను స్వదేశానికి తీసుకువచ్చిన ఈ ప్రత్యేక విమానానికి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఎయిర్ పోర్టు సిబ్బంది స్పెషల్ వాటర్ సెల్యూట్ చేశారు.

Tags

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×