ICC-Jay Shah: అన్ని దేశాల క్రికెట్ జట్లు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం సిద్ధమవుతుంటే, ఐసీసీ బాస్ జై షా మాత్రం జాలిగా గాలిపటాలు ఎగురేసుకుంటున్నారు. సంక్రాంతి వచ్చిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో గాలిపటాలు ఎగరవేస్తారు అన్న సంగతి తెలిసిందే. ఈ కల్చర్ రెండు రాష్ట్రాల్లోనే కాదు గుజరాత్ లాంటి హిందూ సంప్రదాయ ప్రాంతంలో కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి కానుకగా తన సొంత రాష్ట్రంలో గాలిపటాలు ఎగిరే వేశారట ఐసీసీ బాస్ జై షా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. చిన్నపిల్లల తరహాలో జై షా ఈ గాలిపటాలు ఎగరవేశారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో icc బాస్ జై షా కాస్త రిలాక్స్ అయ్యారు. టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో బంగ్లాదేశ్ పర్యటించడం పై అందరిలోనూ సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో.. ఐసీసీ బాస్ జై షా మాత్రం గాలిపటాలు ఎగరవేస్తూ రిలాక్స్ అయిపోయారు. అహ్మదాబాద్ సమీపంలోని ఉత్తరాయనం అనే ప్రాంతంలో గాలిపటాలు ఎగరవేస్తూ అమిత్ షా తనయుడు జై షా మెరిశారు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ గా మారాయి. అయితే ఇందులో జై షా ఫేస్ చూస్తే అతని లాగానే ఉంది. కానీ కొంతమంది ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేసిన వీడియో అంటున్నారు. గాలిపటాలు ఎగురవేసే వీడియో ఒరిజినల్ కాదని.. ప్రస్తుతం ఐసీసీ బాస్ జై షా విదేశాల్లో ఉన్నట్లు పేర్కొంటున్నారు. అయినా గుజరాత్ లో గాలిపటాలు ఎగర వేసే సంస్కృతి లేదని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటు నేపథ్యంలో వేదికలు మార్చాలని.. ఇండియాలో పర్యటించబోమంటూ బంగ్లాదేశ్ పదే పదే చెబుతోంది. ఐపీఎల్ టోర్నమెంట్లో తమకు తమ పరువు పోయిందని.. ఇలాంటి నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇండియాలో పర్యటిస్తే దాడులు జరిగే ప్రమాదం ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్పష్టం చేస్తోంది. అందుకే ఇండియాలో కాకుండా శ్రీలంకలో లేదా పాకిస్తాన్ లో అది కాకపోతే దుబాయ్ వేదికగా టోర్నమెంట్ నిర్వహించాలని కోరుతున్నారు. కానీ ఐసీసీ మాత్రం దీనికి ఒప్పుకోవడం లేదు. ఇండియాలో పర్యటించండి… మీకు స్పెషల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తాం… ఈగ కూడా వాళ్ళనివ్వం.. బంగ్లాదేశ్ ప్లేయర్లను కంటిపాప లాగా చూసుకుంటామని ఐసిసి వెల్లడించింది. అయినా కూడా ఇండియాలో పర్యటించకపోతే జీతాలు కట్ చేస్తామని వారిని ఇచ్చింది ఐసీసీ.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==