BigTV English

IND VS ENG : ఓలీ పోప్ అద్భుత సెంచరీ.. కోలుకున్న ఇంగ్లాండ్..

IND VS ENG : హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. మూడోరోజు మ్యాచ్ లో ఇంగ్లాండ్ దే పై చేయిగా మారింది. వారిని ఆల్ అవుట్ చేయడంలో టీమ్ ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. దీంతో మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఫస్ట్ డౌన్ వచ్చిన ఒలిపోప్ క్రీజులో పాతుకుపోయాడు. భారత విజయానికి ఒక్కడూ అడ్డం పడ్డాడు.

IND VS ENG : ఓలీ పోప్ అద్భుత సెంచరీ.. కోలుకున్న ఇంగ్లాండ్..
IND VS ENG

IND VS ENG : హైదరాబాద్ లో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. మూడోరోజు మ్యాచ్ లో ఇంగ్లాండ్ దే పై చేయిగా మారింది. వారిని ఆల్ అవుట్ చేయడంలో టీమ్ ఇండియా బౌలర్లు విఫలమయ్యారు. దీంతో మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. ఫస్ట్ డౌన్ వచ్చిన ఒలిపోప్ క్రీజులో పాతుకుపోయాడు. భారత విజయానికి ఒక్కడూ అడ్డం పడ్డాడు.


మొత్తానికి తనొక్కడూ 208 బంతులాడి 148 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అందులో 17 ఫోర్లున్నాయి. ఎక్కడా కూడా సిక్స్ కొట్టేందుకు క్రీజు బయటకు రాకుండా ఆడాడు. అదే మనవాళ్లయితే ముందు సిక్స్ కొట్టాలి. తర్వాత సింగిల్ తీయాలన్నట్టే ఆడారు. తను ఒక ఎండ్ లో ఉండిపోవడంతో మిగిలిన వారు తనకి సపోర్ట్ ఇస్తూ ఇన్నింగ్స్ ను నిర్మించారు.

ఇప్పటికి ఇంగ్లాండ్ 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. నాలుగో రోజు 200 పరుగుల లోపు ఆలౌట్ చేయగలిగి,మళ్లీ మనవాళ్లు విజయం కోసం పోరాడాలి.


అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 421/7తో ఆటను ప్రారంభించిన భారత్ మరో 15 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పది బంతుల వ్యవధిలోనే చివరి మూడు వికెట్లను కోల్పోయింది. చివరికి తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఉదయం ఆట ప్రారంభించిన రవీండ్ర జడేజా (87), అక్షర్ పటేల్ (44) త్వరగా అవుట్ అయిపోయారు.

అయితే జో రూట్ వరుస బంతుల్లో జడేజా, బుమ్రాను ఔట్ చేశాడు. జడేజా అవుట్ వివాదాస్పదంగా మారింది. ఆ తర్వాత రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్ కూడా బౌల్డ్ కావడంతో భారత్ కథ 436 పరుగుల వద్ద ముగిసిపోయింది. అంతమందిలో బుమ్రా ఒక్కడే డకౌటయ్యాడు.ఇంగ్లాండ్ బౌలర్లలో జో రూట్ 4, రెహాన్ అహ్మద్, టామ్ హర్ట్ లీ చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ను బజ్‌బాల్ వ్యూహంతోనే మొదలు పెట్టింది. కాకపోతే వికెట్లు పడటంతో వెంటనే వ్యూహం మార్చి డిఫెన్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఓపెనర్ జాక్ క్రాలే (31), డక్కెట్ (47), జో రూట్‌ (2), బెయిర్ స్టో (10), బెన్ స్టోక్స్ (6), బెన్ ఫోక్స్ (34) అవుట్ అయ్యారు.

కానీ వన్‌డౌన్‌లో వచ్చిన ఒలిపోప్ క్రీజులో పాతుకపోయాడు. మనవాళ్లు ముగ్గురు బ్యాటర్లు 80 పరుగుల వద్ద ఆగిపోయారు. కానీ తను మాత్రం సెంచరీ సాధించాడు. అంతేకాదు 148 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ప్రస్తుతం రెహాన్ అహ్మద్ (16*)తో కలిసి పోప్ ఎంతవరకు మ్యాచ్ ను ముందుకు తీసుకువెళతాడనే దానిపై ఇండియా విజయ లక్ష్యం ఆధారపడి ఉంది.భారత్ బౌలర్లలో అశ్విన్ 2, బుమ్రా 2, అక్షర్ పటేల్ 1, జడేజా 1 వికెట్ పడగొట్టారు.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×