E-Paper
Advertisement

IND VS NZ Final : టీమిండియాకు మోడీ గండం? ప్రధాని ఫైనల్ మ్యాచ్ కు రావొద్దు అంటూ ట్రోలింగ్!

IND VS NZ Final : టీమిండియాకు మోడీ గండం? ప్రధాని ఫైనల్ మ్యాచ్ కు రావొద్దు అంటూ ట్రోలింగ్!
Advertisement

IND VS NZ Final : వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రేపు జరగనున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు మోడీ గెస్ట్ గా వస్తున్నారు. 2023 (వన్డే) వరల్డ్ కప్ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పెషల్ గెస్ట్ గా వచ్చాడు.. అప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. రేపు జ‌రుగ‌బోయే మ్యాచ్ మ‌రి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందోన‌ని అభిమానులు టెన్ష‌న్ ప‌డుతున్నారు.

Also Read : IND VS NZ Final : టీమిండియా ముందు మూడు గండాలు…దేవుడు దిగివ‌చ్చినా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం క‌ష్ట‌మే !

ప్రధాని ఫైనల్ మ్యాచ్ కు రావొద్దు అంటూ ట్రోలింగ్

Advertisement

ముఖ్యంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్టేడియానికి వస్తే టీమిండియా ఓడిపోతుందని కాంగ్రెస్ పార్టీ నుంచి విమర్శలు వస్తున్నాయి. మోడీ రావద్దని కాంగ్రెస్ నేతలు కోరుకుంటున్నట్టు స‌మాచారం. ప్ర‌ధాని మోడీ వ‌చ్చిన స‌మ‌యంలో టీమిండియా ఫైన‌ల్ మ్యాచ్ లో ఓట‌మి పాల‌వుతుంద‌ని.. గ‌తంలో కూడా ఇలాగే జ‌రిగింద‌ని ఇప్పుడు కూడా అలాగే జ‌రుగుతుంద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌ధాని మోడీ అహ్మ‌దాబాద్ స్టేడియానికి రావ‌ద్ద‌ని సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ముఖ్యంగా టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టీమిండియా కంటే న్యూజిలాండ్ కే పాజిటివ్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. 2026 టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ టీమిండియా విజ‌యం సాధిస్తే.. వ‌రుస‌గా రెండో సారి టైటిల్ గెలిచిన జ‌ట్టుగా చ‌రిత్ర‌లో నిలిచిపోతుంది. సెమీ ఫైన‌ల్ లో బ‌ల‌మైన ఇంగ్లండ్ జ‌ట్టును ఓడించిన‌ట్టుగానే ఫైన‌ల్ లో న్యూజిలాండ్ ను ఓడించాల‌ని టీమిండియా భావిస్తే.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన‌ట్టే టీమిండియాను కూడా చిత్తు చేయాలని న్యూజిలాండ్ భావించ‌డం విశేషం.

టీమిండియాకు మోడీ గండం?

న్యూజిలాండ్ జ‌ట్టు విజ‌యం సాధిస్తే మాత్రం తొలిసారి టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకున్న జ‌ట్టుగా చ‌రిత్ర క్రియేట్ చేస్తోంది. అలాగే టీమిండియాను టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో అన్ని మ్యాచ్ ల్లో ఓడించిన జ‌ట్టుగా రికార్డు సృష్టిస్తుంది. టీమిండియా విజ‌యం సాధిస్తే.. ఆ రికార్డుకు చెక్ పెట్టిన‌ట్టు అవుతోంది. వాస్త‌వానికి టీమిండియా చివ‌రి సారి టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించింది. న్యూజిలాండ్ జ‌ట్టు సెమీ ఫైన‌ల్ కి కూడా చేరుకోకుండానే ఇంటి బాట పట్టింది. వాస్త‌వానికి ఐసీసీ టోర్నీల్లో పోల్చితే.. టీమిండియా 15 సార్లు ఫైన‌ల్స్ కి చేరుకుంటే.. న్యూజిలాండ్ కేవ‌లం 8వ సారి ఫైన‌ల్ కి చేరుకుంది. భార‌త్ ఫైన‌ల్స్ చేర‌డంతో టాప్ జ‌ట్టుగా నిలిచింది. మ‌రోవైపు టీమిండియా కి మోడీ గండం ఉంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ విచ్చేస్తున్న అహ్మ‌దాబాద్ స్టేడియంలో టీమిండియా విజ‌యం సాధిస్తుందో లేదో వేచి చూడాలి మ‌రీ.
Also Read : IND VS NZ Final: అభిషేక్ బ‌తికిపోయాడు, మిస్ట‌రీ స్పిన్న‌ర్ పై వేటు..ఫైన‌ల్స్ ఆడే టీమిండియా జ‌ట్టు ఇదే

Advertisement

 

Related News

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

Big Stories

Advertisement
×