E-Paper
Advertisement

IND VS NZ Final : టీమిండియా ముందు మూడు గండాలు…దేవుడు దిగివ‌చ్చినా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం క‌ష్ట‌మే !

IND VS NZ Final : టీమిండియా ముందు మూడు గండాలు…దేవుడు దిగివ‌చ్చినా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌డం క‌ష్ట‌మే !
Advertisement

IND VS NZ Final :  టీ-20 వ‌రల్డ్ క‌ప్ టోర్నీలో తొలి సెమీ ఫైన‌ల్ లో సౌతాఫ్రికాను చిత్తు చేసి న్యూజిలాండ్ జ‌ట్టు ఫైన‌ల్ కి వెళ్లింది. అలాగే రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్ టీమిండియా వ‌ర్సెస్ ఇంగ్లండ్ మ‌ధ్య హోరా హోరీగా సాగింది. చివ‌రికీ 7 ప‌రుగుల తేడాతో టీమిండియా విజ‌యం సాధించింది. దీంతో న్యూజిలాండ్ వ‌ర్సెస్ టీమిండియా జ‌ట్లు ఈనెల 08వ తేదీన అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌బోతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే టీమిండియా పై నెగిటివ్ వార్త‌లు వినిపిస్తున్నాయి.

Also Read : IND VS NZ Final: అభిషేక్ బ‌తికిపోయాడు, మిస్ట‌రీ స్పిన్న‌ర్ పై వేటు..ఫైన‌ల్స్ ఆడే టీమిండియా జ‌ట్టు ఇదే

టీమిండియాకి మూడు గండాలు..

Advertisement

అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఆదివారం జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్ కి టీమిండియా కి మూడు గండాలు ఉండ‌టం విశేషం. అందులో మొద‌టిది రిచ‌ర్డ్ కెటిల్ బ‌రో (Richard Kettleborough) అంఫైర్. ఇత‌ను టీమిండియా కి అన్ని నెగిటివ్ డిసెష‌న్స్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. రేపు జ‌రుగ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్ కి ఇత‌నే అంఫైర్. అహ్మ‌దాబాద్ న‌రేంద్ర మోడీ స్టేడియం రెండో గండం. ఇక్క‌డ 2023 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్ ఓడిపోయాం. ఆస్ట్రేలియా జ‌ట్టు టైటిల్ ని ఈ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో ఎగురేసుకుపోయింది. ఈ సారి కూడా న్యూజిలాండ్ వ‌ర్సెస్ టీమిండియా టీ 20 ఫైన‌ల్ మ్యాచ్ ఇదే స్టేడియం కావ‌డం విశేషం. ఇక మూడో గండం ఏమిటంటే..? న్యూజిలాండ్ వ‌ర్సెస్ టీమిండియా మ‌ధ్య జ‌రిగిన‌ ఐసీసీ టోర్న‌మెంట్ లో టీమిండియా గెల‌వ‌దు. పాత రికార్డులు అన్ని అలాగే ఉన్నాయి. గ‌త టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో 3 మ్యాచ్ ల్లో కూడా న్యూజిలాండ్ పై ఇండియా ఓట‌మి పాలైంది.

టీమిండియా రికార్డును బ్రేక్ చేస్తుందా..?

దీంతో 2026 టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ న్యూజిలాండ్ దే అని సోష‌ల్ మీడియా ఓ వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. వాస్త‌వానికి 2024 టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీస్ కూడా చేర‌లేదు న్యూజిలాండ్ జ‌ట్టు. అంత‌కు ముందు 2022 టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో సెమీఫైన‌ల్ లో ఓట‌మి పాలైంది. 2021 టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ త‌రువాత మ‌ళ్లీ ఐదేళ్ల‌కు ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌బోతుంది. ఐసీసీ టోర్నోలో న్యూజిలాండ్ టీమ్ ఫైన‌ల్ కి చేర‌డం ఇది ఎనిమిదో సారి. భార‌త్ ఇప్ప‌టికే 15 సార్లు ఐసీసీ ఫైన‌ల్స్ ఆడి టాప్ లో ఉంది. ఇక ఆస్ట్రేలియా జ‌ట్టు 14 సార్లు ఐసీసీ ఫైన‌ల్స్ ఆడింది. ముఖ్యంగా న్యూజిలాండ్ జ‌ట్టు ఫైన‌ల్ కి చేర‌డంతో టీమిండియా ఫ్యాన్స్ లో కంగారు మొద‌లైంది. ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా జ‌ట్టు.. న్యూజిలాండ్ పై ఒక్క టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ గెల‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. టీ-20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త్ జ‌ట్టు మూడు సార్లు న్యూజిలాండ్ తో త‌ల‌ప‌డ‌గా.. మూడు మ్యాచ్ ల్లోనూ ఓట‌మి పాలైంది. దీంతో ఆదివారం జ‌రుగ‌బోయే ఫైన‌ల్ మ్యాచ్ పై ఉత్కంఠ నెల‌కొంది. న్యూజిలాండ్ జ‌ట్టు పై టీమిండియా విజ‌యం సాధించి రికార్డు క్రియేట్ చేస్తుందో.. లేక న్యూజిలాండ్ పై ఒక్క మ్యాచ్ కూడా గెల‌వ‌ని జ‌ట్టుగా టీమిండియా నిలుస్తుందో వేచి చూడాలి మ‌రీ.

Advertisement

Also Read : Inzamam ul haq: బుమ్రా బాల్ టాంప‌రింగ్ చేశాడు, అతన్ని బ్యాన్ చేయండి !

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×