IND VS PAK: ACC పురుషుల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ లో భాగంగా టీమిండియా A వర్సెస్ పాకిస్తాన్ A ( India A vs Pakistan A) జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియాపై పాకిస్తాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఏకంగా టీమిండియాపై 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. గత వారం రోజులుగా ఏషియా కప్ రైసింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ ( ACC Mens Asia Cup Rising Stars 2025) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దోహా ( West End Park International Cricket Stadium, Doha) వేదికగా ఈ మ్యాచ్ లను నిర్వహిస్తున్నారు.
అయితే ఈ మ్యాచ్ లో గ్రూప్ స్టేజ్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ( India A vs Pakistan A) మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ చేతిలో టీమిండియా దారుణంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా అలాగే పాకిస్తాన్ ప్లేయర్లు ఇద్దరు గొడవ పడ్డట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ పరేషాన్ అవుతున్నారు. గ్రౌండ్ ఈ తన్నుకోవడం ఎంట్రా బాబు అంటూ వాపోతున్నారు. పాకిస్తాన్ నా కొడుకులను అక్కడే చంపి, పాతరేయండి అంటూ మరికొంత మంది రెచ్చిపోయి, కామెంట్స్ చేస్తున్నారు.
పాకిస్తాన్ A వర్సెస్ టీమ్ ఇండియా A జట్ల మధ్య నిన్న మ్యాచ్ జరిగిన నేపథ్యంలో ఇరు ప్లేయర్లు కొట్టుకున్నట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. వాస్తవంగా ఈ వీడియో ఫేక్ అని తెలుస్తోంది. ఏఐ ద్వారా క్రియేట్ చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమ్ ఇండియా ప్లేయర్ నేహాల్ వధేరా ( Nehal Wadhera ) అందుకున్న క్యాచ్ ఇవ్వాలని మారింది. ఔట్ అని టీమిండియా, నాటౌట్ అని పాకిస్తాన్ రెండు జట్లు కొట్టుకున్నట్లు ఈ వీడియోను క్రియేట్ చేసి వదిలారు. దీంతో తెలియని వాళ్లంతా ఇది నిజమే అనుకోని షాక్ అవుతున్నారు.
టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ గ్రూప్ Bలో భాగంగా 6వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భాగంగా పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా, 19 ఓవర్లు ఆడి, 136 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక ఈ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలో ఛేదించింది పాకిస్తాన్. ఈ విజయంతో సెమీస్ కు దూసుకెళ్లింది పాకిస్తాన్.
?igsh=MWQxZHhvdm1xZjNhag%3D%3D