IND VS SA 2nd Test: దక్షిణాఫ్రికా తో జరిగిన రెండవ టెస్ట్ లో టీమిండియా ఓటమిని చవిచూసింది. 549 పరుగుల లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు.. చెత్త ప్రదర్శనతో అత్యల్ప స్కోరుకే ఆల్ అవుట్ అయ్యింది. సఫారీ బౌలర్ల ధాటికి విలవిలలాడిన భారత జట్టు.. ఐదవ రోజు రెండవ సెషన్ లోనే కుప్ప కూలింది. ఐదవ రోజు రెండో ఇన్నింగ్స్ లో 140 పరుగులకే ఆల్ అవుట్ అయ్యింది.
Also Read: Suresh Raina: టీమిండియా ప్లేయర్లు దద్దమ్మలాగా ఆడితే, గంభీర్ ఏం చేస్తాడు
రవీంద్ర జడేజా {54} మినహా మిగతా బ్యాటర్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సైమన్ 6 వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహారాజ్ 2, ముత్తుస్వామి, మార్కో చెరో వికెట్ పడగొట్టారు. దీంతో సఫారీలు 408 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించారు. ఈ క్రమంలో సిరీస్ ని 2-0 తో క్లీన్ స్వీప్ చేశారు. రెండు వికెట్ల నష్టానికి 27 పరుగులతో 5వ రోజు రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియాకి ఆరంభం నుండే షాక్ లు తగిలాయి.
నాలుగవ రోజు ఓపెనర్లు యశస్వి జైష్వాల్ {13}, కేఎల్ రాహుల్ {6} పరుగులకే పెవిలియన్ చేరారు. ఇక ఐదవ రోజు తొలి సెషన్ లో మూడు వికెట్లు కోల్పోయి డ్రా కోసం పోరాడింది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా స్పిన్నర్ హార్మర్ ధాటికి భారత బ్యాటర్లు విలవిల్లాడారు. తొలి సెషన్ ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి భారత జట్టు 90 పరుగులు చేసింది. ఇక రెండవ సెషన్ లో ఆల్ అవుట్ కాకుండా మరో అరవై ఓవర్లు అడగలిగితే మ్యాచ్ డ్రా అవుతుందన్న నేపథ్యంలో.. టీమిండియా ప్లేయర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. రవీంద్ర జడేజా {54}, వాషింగ్టన్ సుందర్ {16}, రిషబ్ పంత్ {13}, సాయి సుదర్శన్ {14}, యశస్వి జైస్వాల్ {13}.. మినహా మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.
గౌహతి టెస్ట్ లో భారత ఓటమితో పాయింట్ల పట్టికలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. నాలుగు మ్యాచ్ లలో ఆడి అన్నింటిలోనూ గెలుపొందింది. అందువల్ల అగ్రస్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానంలో దక్షిణాఫ్రికా నిలిచింది. మూడవ స్థానాన్ని శ్రీలంక సాధించింది. అయితే ఇప్పుడు గౌహతి టెస్టులో భారత్ ఓడిపోయిన కారణంగా.. పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ తో సమంగా నిలవడం కూడా కష్టంగా కనిపిస్తోంది.
Also Read: Venkatesh Iyer: ఐపీఎల్ లో Impact Player తొలగించాల్సిందే… మా కెరీర్లు సంకనాకిపోతున్నాయి !
ఎందుకంటే మ్యాచ్ ల సంఖ్య ఎక్కువగా ఉండడం, ఓటముల సంఖ్య నాలుగు కంటే పెరగడం వల్ల పాకిస్తాన్ కంటే దిగువ స్థానానికి జారిపోతుంది. ఇలాంటి పరిస్థితి డబ్ల్యూటీసి రేసులో భారత్ పై తీవ్ర ఒత్తిడిని పెంచబోతోంది. ఇకనుండి జరగబోయే సిరీస్ లలో ఎటువంటి తప్పు జరిగినా భారత జట్టు గమ్యం మరింత కఠినంగా మారనుంది.